Team India: టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. సూపర్ 12 లో టేబుల్ టాపర్ గా నిలిచిన రోహిత్ సేన ఇంకో రెండు అడుగులు వేయగలిగితే చాలు టీ20 ట్రోఫీ ని ముద్దాడే క్షణం ఆసన్నమవుతుంది. ఇందులో మొదటి సవాలుని స్వీకరించబోతోంది టీమిండియా. సెమీస్ లో ఇంగ్లీష్ టీం తో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఇంక ఫైనల్ కే. ఫైనల్స్ లో దాయాది పాకిస్తాన్ తో తలపడవచ్చు.

ఇద్దరు వికెట్ కీపర్లలో ఎవరిని ఎంపిక చేయాలి?
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి ముందు టీమిండియా కి ఒక పెద్ద సవాలు ఎదురయింది. ప్రస్తుతం టీమ్ లో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఒకరు దినేష్ కార్తీక్ ఇంకొకరు రిషబ్ పంత్ ఇద్దరిలో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద ఎవరి వద్దా క్లారిటీ లేదని నిపుణులు చెప్తున్నారు.
దినేష్ కార్తీక్ ఫినిషర్ గా టీమ్ లోకి వచ్చాడు. అయితే ఇప్పటి వరకూ ఈ పాత్ర పోషించలేకపోయాడు. ఐదు మ్యాచ్ లలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అతని స్థానంలో పంత్ కి అవకాశం ఇవ్వాలనే వాదన గట్టిగా వినబడుతోంది. కొంత మంది దిగ్గజ ఆటగాళ్ళు కూడా ఈ వాదనకి ఆజ్యం పోస్తున్నారు.

Team India:
రిషబ్ పంత్ విషయానికొస్తే ఈ కుర్ర బ్యాట్సమెన్ దూకుడుగా అడగలడు. దీనికి తోడు పంత్ కి ఆస్ట్రేలియా గడ్డ మీద మంచి రికార్డ్ ఉంది. ఈ రికార్డ్ ఆధారంగా పంత్ కి అవకాశం ఇవ్వాలని కొందరు అంటున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరిని ఆడించాలి అనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారట టీమ్ మేనేజ్మెంట్,హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్,సారధి రోహిత్ శర్మ. చూడాలి మరి ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారో. ఒకవేళ ఇద్దరినీ తీసుకుంటే ఇంకొక అతగాడిని దూరం పెట్టాల్సి వస్తుంది.

































