ఒకప్పుడు పాఠశాలలకు కాలేజీలకు సెల్ ఫోన్ అనుమతి ఉండేది కాదు. అయితే కరోనా పూర్తిగా అన్ని నియమ నిబంధనలను మార్చేసింది. ఇప్పుడు తరగతి గదులు వినాలంటే సెల్ ఫోన్ ఎంతో ముఖ్యంగా మారిపోయింది. కరోనా కారణం వల్ల పాఠశాలలు మూతబడటం చేతే పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని పూర్తిగా సెల్ ఫోన్ కి అంకితమయ్యారు. కొంత మంది పిల్లలకు అది వ్యసనంగా మారడం చేత పిల్లలను అదుపు చేయాలని తల్లిదండ్రులు పిల్లలను మందలించడంతో పిల్లలు ఎంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి.
తాజాగా ఇలాంటి ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్ లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది స్థానికంగా నివసించే ఓ పదో తరగతి విద్యార్థి నిత్యం సెల్ ఫోన్ కి బానిస అయ్యి సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుడడంతో తన తండ్రి తనని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఘోరమైన నిర్ణయాన్ని తీసుకుంది.
అందరూ పడుకొని ఉండగా బాలిక ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.































