Connect with us

Movie News

లవ్ & మర్డర్, మిస్ట్రీ తగ్గేదేలే మూవీ రివ్యూ!

Published

on

బ్యానర్ : భ్రద ప్రొడక్షన్స్
సినిమా : తగ్గేదే లే’
రిలీజ్ : 4.11.22
నిర్మాత : ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి
దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
నటీనటులు :నవీన్ చంద్ర దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే, మ‌క‌రంద్ దేశ్ పాండే, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, పూజా గాంధీ, రాజా ర‌వీంద్ర‌, ర‌వి శంక‌ర్
కెమెరా : వెంకట్ ప్రసాద్
ఎడిటింగ్ : గ్యారీ బి. హెచ్

Advertisement

దండుపాళ్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రాజు ఆ సినిమాకు సీక్వెల్ గా రెండు భాగాలు తెరకెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని నటులను తీసుకొని ఒక ఫ్యామిలీ, మర్డర్, మిస్టరీ తో రోపొందించిన చిత్రమే ” తగ్గేదే లే”. ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా నవీన్ చంద్ర దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తెరాకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ పాండే, పి. వి. సుబ్బారావు రెడ్డి లు నిర్మించారు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. నవంబర్ 4న సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో చూద్దాం పదండీ..

కథ
ఈ సినిమా మర్డర్ మిస్ట్రీ, డ్రగ్స్, లవ్ వంటి మూడు కథలతో సాగుతుంది. ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మేనత్త కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి ఈశ్వర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి ఈశ్వర్ ఇంట్లో ఉంటూ… అంతకుముందు తనతో దిగిన ఫొటోలతో ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు లిజి తో ఈశ్వర్ కు ఎలా పరిచయం ఏర్పడింది,,వారిద్దరి మధ్య ఉన్న కథ ఏమిటి? ఈశ్వర్ సంబందించిన వీడియోస్ లిజి దగ్గరకు ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్న ఈశ్వర్ కు తన ఇంటిలో లభించిన మహిళ శవం దొరుకుతుంది. అప్పటివరకు దండుపాళ్యం బ్యాచ్ తో సంబంధం ఉందని అనుమానం పడుతున్న పోలీసులకు ఈశ్వర్ ఇంట్లో అమ్మాయి శవం దొరకడం తో ఆ అమ్మాయిని ఈశ్వర్ చంపాడనే అనుమానంతో పోలీస్ ఆఫీసర్ చలపతి(రవి శంకర్), రాజా రవీంద్ర ఇంటరాగేషన్ చెయ్యాలని అరెస్ట్ చేస్తారు.ఈ ఇంటరాగేషన్ లో ద్వారా ఈశ్వర్ ద్వారా తెలుసుకున్న నిజాలు ఏమిటి?ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? ఆ హత్య నుండి తను ఎలా బయట పడ్డాడు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) దండుపాళ్యం గ్యాంగ్ ను, డ్రగ్ మాఫియాను ఏం చేశాడు ? అనేది తెలుసు కోవాలంటే తగ్గేదేలే సినిమా తప్పక చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర .నవీన్ చంద్ర భార్య గా దివ్యా పిళ్ళై ట్రెడిషనల్ వైఫ్‌ పాత్రలో చక్కగా నటించింది. నవీన్ చంద్ర ప్రియురాలు గా అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. భార్యకు, ప్రియురాలు మధ్య నలిగిపోయే ఎమోషన్ పాత్రలో నవీన్ చంద్ర ఆకట్టు కున్నాడు. సినిమా ఎక్కువ భాగం నవీన్ చంద్ర చుట్టూ తిరుగుతుంది.చలపతి పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రవిశంకర్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ‘పోలీస్‌గా రాజా రవీంద్ర,. ‘దండుపాళ్యం’ గ్యాంగ్ సభ్యులుగా మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.హీరో స్నేహితులు గా ‘గెటప్’ శీను, ‘ఆటో’ రామ్ ప్రసాద్ లు తమ కామెడీ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.సమరం లాంటి డాక్టర్ సమరం గా ’30 ఇయర్స్’ పృథ్వీ. చాలా బాగా నటించాడు. ఇలా ఈసినిమాకు పని చేసిన వారందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు

సాంకేతిక నిపుణులు పనితీరు
ఈ కథ కొత్తది కాకపోయినా కూడా .కొంత డిఫరెంట్ గా మర్డర్ మిస్ట్రీ, డ్రగ్స్, లవ్ ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ను సెలెక్ట్ చేసుకొని , ట్విస్ట్స్& టర్న్స్ తో . స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో దర్శకుడు శ్రీనివాస్ రాజు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు .క్లెమాక్స్ లో దండుపాళ్యం గ్యాంగ్, నవీన్ చంద్ర, రవి శంకర్, అయ్యప్ప, పూజా గాంధీ లపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బమ్స్ కలిగించడమే కాకుండా ప్రేక్షకులకు ఉత్కంఠ కు గురి చేస్తాయి. ఇందులోని యాక్షన్ సీన్స్, చూస్తుంటే దండుపాళ్యం సినిమాకు మించిన యాక్షన్ సీన్స్ తో మాస్ డైరెక్టర్ గా దర్శకుడు శ్రీనివాస్ రాజు తనదైన ముద్ర వేసుకున్నాడని చెప్పవచ్చు.ఈ సినిమా నేపథ్య సంగీతం, బాగుంది. చరణ్ అర్జున్ చేసిన ఇళయరాజా – భారతిరాజా ల ‘మాటే మంత్రము’ సాంగ్ రీమిక్స్, చేసి దానిని తెరకెక్కించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. గ్యారీ బి. హెచ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. వెంకట్ ఆరే ఫైట్స్ బాగున్నాయి. భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ ప్రేమ్ కుమార్ పాండే, పి. వి.సుబ్బారావు రెడ్డి లు ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు..మర్డర్ మిస్ట్రీ, లవ్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘దండు పాళ్యం’ సినిమా కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

Advertisement

రివ్యూ రేటింగ్ : 3/5

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!