Mahesh Babu: నందమూరి బాలకృష్ణ జోష్ లో ఉన్నారు. ఆయన నటించిన ‘ అఖండ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ లు క్రియేట్ చేసింది. బాలయ్య కెరీర్ లోనే వందకోట్ల సినిమాగా నిలిచింది. ఇటు సినిమాతోనే కాకుండా.. ఓటీటీలో ప్రారంభమైన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో అదరగొడుతున్నారు.

ఇప్పటికే ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ఇప్పటికే బాలయ్య… రాజమౌళి, బన్నీ, బోయపాటి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి వారితో టాక్ షో నిర్వహించారు. తాజాగా అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇప్పుడు ఇది అందరిలోనూ ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

అయితే గతంలో నందమూరి తారకరామారావు- సూపర్స్టార్ కృష్ణ మధ్య వైరం ఉండేదని అందరూ అనుకుంటారు. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలను కూడా కృష్ణ తీశారని అభిమానులు అనుకుంటారు. సినిమాలతో పాటు పొలిటికల్ గా కూడా వీరిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయంటూ అందరూ అనుకుంటారు.
సినిమా తర్వాత సినిమాను చూసి..
అయితే ఈ వివాదంపై మహేష్ బాబు అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్-కృష్ణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న గారితో ఎన్టీఆర్ గారికి గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని అని అన్నారు. ఈ సినిమా తర్వాత సినిమాను చూసి ఎన్టీఆర్ గారు ఎంతో అభినందించారని నాన్న ఎప్పుడూ అంటూ ఉండే వారిని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అయ్యాయి.
































