Connect with us

Featured

Flash Back : డూప్ లేకుండా స్టంట్ చ్గేస్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో చిన్న వయసులోనే కన్నుమూసిన హీరో !

Jayan: సాధారణంగా హీరోలు సినిమాలలో కొన్ని యాక్షన్ సన్నివేశాలలో డూపులను వాడుతూ ఉండటం సర్వసాధారణమైన విషయమే. కొందరు హీరోలు ధైర్యం చేసి మరీ రిస్క్

Published

on

Jayan: సాధారణంగా హీరోలు సినిమాలలో కొన్ని యాక్షన్ సన్నివేశాలలో డూపులను వాడుతూ ఉండటం సర్వసాధారణమైన విషయమే. కొందరు హీరోలు ధైర్యం చేసి మరీ రిస్క్ అయినా పర్వాలేదు ఎఫెక్ట్ బాగా రావాలి అన్న ఉద్దేశంతో అటువంటి సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. అయితే అటువంటి భయంకరమైన సన్నివేశాలు ఎక్కువగా నిపుణుల పర్యవేక్షణలో చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు నిపుణుల పర్యవేక్షణలో చేసినప్పటికీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ఉంటారు. అలా కొన్ని కొన్ని సార్లు చేసే చిన్న పొరపాట్లే భారీ మూల్యానికి దారి తీస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో విషయంలో కూడా అదే జరిగింది. ఆ హీరో పేరు జయన్.

Jayan: డూప్ లేకుండా సాహసం చేసి హెలికాప్టర్ ప్రమాదంలో చిన్న వయసులోనే కన్నుమూసిన హీరో..?
Jayan: డూప్ లేకుండా సాహసం చేసి హెలికాప్టర్ ప్రమాదంలో చిన్న వయసులోనే కన్నుమూసిన హీరో..?

జయన్ 1972 లో మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా మలయాళంలో 100కు పైగా సినిమాల్లో నటించి అరుదైన ఘనతను సాధించుకున్నాడు. అంతే కాకుండా క్లాస్ గా సాగే కేరళ ఎంటర్టైన్మెంట్ ని యాక్షన్ వైపు మళ్ళిన వారిలో ఇతని మొదటి పేరు అని చెప్పవచ్చు. అలా ఇతను కోట్లాది మంది అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా అతనికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉండేది. కేవలం ఎనిమిది ఏళ్లలో 100 మైలురాయిని చేరుకోవడం అంటే అంత ఈజీ కాదు. అయితే జయన్ కు అంతటి పేరు రావడానికి కారణం అతను చేసిన పోరాటాలే.

Jayan: డూప్ లేకుండా సాహసం చేసి హెలికాప్టర్ ప్రమాదంలో చిన్న వయసులోనే కన్నుమూసిన హీరో..?
Jayan: డూప్ లేకుండా సాహసం చేసి హెలికాప్టర్ ప్రమాదంలో చిన్న వయసులోనే కన్నుమూసిన హీరో..?

ఇతను తన సినిమాలలో చాలా వరకు డూప్ లేకుండా తానే స్వయంగా కంపోజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.అతని అసలు పేరు కృష్ణన్ నాయర్. అలా ఒకసారి అతను హిందీ సినిమా రీమేక్ కి ఒప్పుకున్నారు. 1965 లో యాష్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన వక్త్ సినిమాని 1980లో కొలిలక్కం సినిమా పేరు తో పునః నిర్మించారు పిఎన్ సుందరం దర్శకులు.ఇక అందులో క్లైమాక్స్ లో ఒక వ్యక్తి బైక్ ని నడుపుతుండగా వెనుక కూర్చున్న జయన్ తనపై నుంచి వెళ్తున్న హెలికాప్టర్ రాడ్ ని అందుకునే సీన్ వుంది. ఇక ఆ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో ఫస్ట్ టేక్ లోనే ఓకే అయింది.

హౌస్ ఫుల్ కలెక్షన్లు…

కానీ జయన్ కి కాస్త అసంతృప్తి కలగడంతో మళ్లీ చేద్దామని అన్నారు. ఇక రెండవ సారి చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత పట్టు తప్పడంతో కిందపడిపోయారు. ఇక ఆ ప్రమాదంలో హీరో జయన్ అక్కడికక్కడే మరణించారు. అయితే వాహనం కూలిపోయిన కూడా పైలెట్ బతికాడు. ఇక జయన్ చనిపోయిన సమయంలో అతను నటించిన దీపం సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఇక అతడి మరణవార్త విన్న అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. ఇక అతను చనిపోయిన తరువాత కూడా ఆయన సినిమాలు 8 రిలీజ్ అయ్యాయి. ఈ సంఘటన 1980 నవంబర్ 16న చోటు చేసుకుంది. ఇక అప్పటికి అతని వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే.

Advertisement

Continue Reading
Advertisement

Featured

YS Jagan: లండన్ నుంచి తిరిగి వచ్చిన వైయస్ జగన్.. ముఖ్య నేతలతో కీలక భేటీ?

Published

on

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తికాగా 17వ తేదీ ఈయన లండన్ వెళ్లారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఈయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు విమానాశ్రయంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ లండన్ పర్యటన నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ కి దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడంతో వెంటనే ఈయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసిపి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల ఫలితాలపై కొన్ని దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.

Advertisement

మరి కొన్ని గంటలలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో జగన్ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించినటువంటి ఈయన ఈసారి కూడా తమకే అనుకూలంగా ఉందని తను లండన్ వెళ్ళటానికి ముందే వచ్చేది మన ప్రభుత్వమే అని తెలియజేశారు.

వచ్చేది వైసీపీనే…
పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలలో 2019 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సీట్ల కంటే మరికొన్ని ఎక్కువగానే రాబోతున్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఘటనలు అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని ఈయన నేతలకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

AP Election Result: అందరి చూపు ఆంధ్ర పైనే.. ఫలితాలు ఎవరికీ అనుకూలం?

Published

on

AP Election Result: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా జూన్ నాల్గవ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇక కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని వైసిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేయడమే కాకుండా కోట్లలో బెట్టింగులు కూడా కడుతున్నారు.

మరోవైపు జూన్ 9వ తేదీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని కూడా చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తామే అధికారంలోకి రాబోతున్నారని చాలా బలంగా నమ్ముతున్నారు.

Advertisement

అధికారం ఎవరిదీ…
ఇకపోతే ఈసారి జరిగిన పోలింగ్ సరళి చూస్తే అంచనాలు వేయడం కూడా కాస్త కష్ట తరమే అని చెప్పాలి. పోలింగ్ భారీ స్థాయిలో పెరగడం దేనికి సంకేతం అన్న విషయంపై అందరూ అయోమయంలో ఉన్నారు. అయితే నేడు సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్ కి కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Exit Polls: ఉత్కంఠతను రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలు ఎవరికీ అనుకూలం?

Published

on

Exit Polls: జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు వెలబడనున్న నేపథ్యంలోనే అందరి ఆసక్తి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మే 13వ తేదీ ఈ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆధారంగానే అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠత భరితంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 6 గంటలకు వెలబడుతున్నాయి. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకు అనుకూలంగా మారుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సంక్షేమ పథకాలు తమ ఐదేళ్ల పరిపాలన ప్రజలకు నచ్చే స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని సంక్షేమ పథకాలే తిరిగి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాయని వైసిపి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తామే అధికారంలోకి రాబోతున్నారని చెబుతున్నారు మరోవైపు ఎన్నికలు కూడా వార్ వన్ సైడ్ అనే లాగా జరగలేదు.

Advertisement

ఎవరిది అధికారం..
ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎవరికి అనుకూలంగా మారాయి.. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాలపై ఎంతో ఆత్రుత నెలకొంది. ఇక ఇప్పటికే ఎన్నో సంస్థలు సర్వేలు చేయగా అన్ని సర్వేలలోనూ వైసీపీకే అధికారం ఉందని చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది ఎదురు చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!