హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈయన నటించిన నాలుగైదు చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో శర్వానంద్ తన ఆశలన్నీ తన తదుపరి చిత్రాల పెట్టుకున్నారు. ప్రస్తుతం శర్వా ఉన్న పరిస్థితులలో అతనికి ఒక సూపర్ హిట్ అంతేతప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేడు.

ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన మహా సముద్రం సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే శర్వానంద్ డ్రీమ్ వారియర్స్ పిక్చర్ నిర్మాణసంస్థలో ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా మేకర్స్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో విడుదల చేయటం వల్ల ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్లను సాధించలేదన్న కారణంతో మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటిటీలో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇలా ఈ సినిమాని థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాణ సంస్థ హీరో శర్వానంద్ పై నమ్మకం లేకే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే హీరో శర్వానంద్ అవమానించినట్లే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తే మరోసారి డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఇందులో క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.































