Tollywood: ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్నికలలో నిలబడిన సంగతి మనకు తెలిసిందే. హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నగరి నియోజక వర్గం నుంచి సినీ నటి రోజా ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి అలాగే టిడిపి పార్టీకి పలు సినీ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో కూడా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ టాలీవుడ్ స్టార్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎవరికి మద్దతు తెలపలేదు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.
సినీ కెరియర్ కు ఇబ్బందులు..
ఇలా ఎన్నికలకు టాలీవుడ్ స్టార్స్ దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు ఒకవేళ తాము సపోర్ట్ చేసే పార్టీ కాకుండా అధికారంలోకి మరో పార్టీ వస్తే తమ సినీ కెరీర్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఇలా సెలబ్రిటీలందరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది స్టార్స్ ఆ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి కానీ ప్రస్తుతం మాత్రం సెలబ్రిటీలందరూ కూడా మౌనంగా ఉన్నారనే చెప్పాలి.
































