Connect with us

Featured

INSPIRING STORY: పాటల కోకిల పార్వతి… నవ్విన ఊరికే బస్సు తెప్పించిన ప్రతిభ…!

INSPIRING STORY: ప్రతిభ ఎవరి సొంత కాదు.. కేవలం డబ్బు, హోదా టాలెంట్ కు గీటురాయి కాదు. ప్రస్తుతం మనం చూస్తున్న సెలబ్రెటీలు జీరోస్థాయి నుంచి

Published

on

INSPIRING STORY: ప్రతిభ ఎవరి సొంత కాదు.. కేవలం డబ్బు, హోదా టాలెంట్ కు గీటురాయి కాదు. ప్రస్తుతం మనం చూస్తున్న సెలబ్రెటీలు జీరోస్థాయి నుంచి హీరోలుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. సరిగ్గా ప్రయత్నిస్తే చాలీ చాలని ఆర్థిక పరిస్థితులు కూడా లక్ష్యం ముందు తలవంచుతాయి. మనల్ని ఎగతాలి చేసి నోర్లే.. పొగుడుతూ ఉంటాయి. ఇవి మనం చాలా సందర్భాల్లో చూసినవే. తాజాగా సంగీత ప్రపంచంలోకి ఇలాగే ఓ యువకెరటం దూసువచ్చింది. రూపం కాకిలా.. గొంతు కోకిలలా ఉందంటూ.. చాలా మంది ఎగతాలి చేసినా.. ఏ ఒక్క క్షణం కూడా ఆమె తన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. 

INSPIRING STORY: పాటల కోకిల పార్వతి… నవ్విన ఊరికే బస్సు తెప్పించిన ప్రతిభ…!
INSPIRING STORY: పాటల కోకిల పార్వతి… నవ్విన ఊరికే బస్సు తెప్పించిన ప్రతిభ…!

ఇదంతా ఎవరికోసం చెబుతున్నానంటే.. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సెషన్ గా మారిని దాసరి పార్వతి గురించి. అసలెవరీ పార్వతి అంటే.. ‘ సరిగమప’ కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న యువతి. ఆమె పాటతో న్యాయ నిర్ణేతలు, టాప్‌ సింగర్స్, ప్రేక్షకులు అందరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు పార్వతి అంటూ.. తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజెన్లు. 

INSPIRING STORY: పాటల కోకిల పార్వతి… నవ్విన ఊరికే బస్సు తెప్పించిన ప్రతిభ…!
INSPIRING STORY: పాటల కోకిల పార్వతి… నవ్విన ఊరికే బస్సు తెప్పించిన ప్రతిభ…!

ఆమె నేపథ్యం కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంత కావడం విశేషం. ఆమెది కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామం. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతన్న కుటుంబం వాళ్లది. ఆమెకు ఇద్దరు అన్నలు ఉన్నారు. తను నిర్థేశించుకున్న లక్ష్యం వైపు సాగింది. ఆమె లక్ష్యాన్ని సాధించేందుకు చదువును కూడా పక్కన పెట్టింది. పల్లెటూరి అమ్మాయికి ఇవన్నీ అవసరమా అన్న నోర్లే.. ఇప్పుడు ఆమెను పొగడ్తలతో ముంచెతుతున్నారు. ఇంటర్‌ వరకు చదివి ఆ తర్వాత తన పూర్తి దృష్టి సంగీత సాధన మీదే పెట్టింది. ఆ ఊరికి బస్సు సౌకర్యం లేకపోయినా.. కిలో మీటర్లు నడిచి సంగీతం నేర్చుకుంది.

పాటతో ఊరికి వచ్చిన బస్సు..


ఆమె పాటకు మంత్రముగ్దులైన జడ్జిలు ‘నీకు ఏం కావాలో కోరుకో’ అని అడగగానే.. ‘నాకు ఏం వద్దు సార్‌ మా ఊరికి బస్సు వస్తే చాలు’ అనేసింది. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె గ్రామానికి బస్సు వచ్చింది. ఎన్నాళ్ల నుంచో పార్వతి ఊరికి బస్ సౌకర్యం లేదు. తను సంగీతం నేర్చుకోవడానికి కూడా కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. ఒక సాధారణ యువతిగా ఊరి నుంచి వెళ్లిన పార్వతి. తన సొంతూరుకు బస్ రావడానికి కారణం అయింది. ఎంతో కాలం ఎదురుచూసిన బస్సు పార్వతి పాటతో వచ్చిందంటూ.. ఆ ఊరి వాళ్లకు వచ్చిందంటూ.. తెగ ఆనందపడిపోతున్నారు.

Advertisement

Featured

Pawan Kalyan: ఆ రోజు నుంచే డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించబోతున్న పవన్ కళ్యాణ్?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి గెలుపు అందుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పిఠాపురం నుంచి 70 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఈయన కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేయగా 100కు 100% విజయం సాధించారు.

ఇక పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది జనసేన నాయకులకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా ఈయన నియమింపబడ్డారు.

ఇలా మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను త్వరలోనే తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటేరియట్లో ఈయనకు ఛాంబర్ సిద్దమవుతుందని త్వరలోనే ఈయన మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మాత్రమే కాకుండా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు.

Advertisement

ప్రజాసేవకే పరిమితం..
ఇక రాజకీయాలలో ఈయన బిజీగా మారిన నేపథ్యంలో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పవన్ కళ్యాణ్ తెరపై మనం చూడలేమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయన కమిట్ అయిన మూడు సినిమాలు షూటింగ్ పనులు సగం వరకు పూర్తి చేసుకున్నాయి. అయితే ఆయనకు వీలైనప్పుడు మిగతా సినిమాలను పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల పైన ప్రజాసేవకే దృష్టి సారిస్తారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: రేవంత్ రెడ్డికి తెలియకుండానే జగన్ రెడ్డి ఇంటి ముందు కూల్చివేతలు జరిగాయా?

Published

on

YS Jagan: తెలంగాణలో ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చోటు చేసుకున్నటువంటి కూల్చివేతల సంచలనంగా మారాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలాకాలం నుంచి నివాసం ఉండట్లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే లోటస్ పాండ్ వద్ద ఉన్నటువంటి తన ఇంట్లో తన చెల్లెలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మ ఉంటున్నారు. ఈమె తెలంగాణ ఆంధ్ర రాజకీయాలలో చురుగ్గా ఉన్నా కూడా ఇక్కడి నుంచే కార్యాచరణ నిర్వహించేవారు. అయితే తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం వేయించుకున్న మూడు షెడ్లను కూల్చి వేశారు.

ఈ విధంగా జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు నిర్వహించడంతో రహదారి చాలా అసౌకర్యంగా మారిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్‌ ఈ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం పై అధికారులకు కూడా తెలియకుండా జరిగాయని తాజాగా మరొక వైరల్ గా మారింది.

Advertisement

సీఎంకు తెలియదా…
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నటువంటి విషయం తెలియదని, అయితే ఈ కూల్చివేతలు జరిగిన 24 గంటల లోపే సదరు అధికారిపై సస్పెన్స్ వేటు వేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.జగన్ ఇంటి వద్ద ఆక్రమణలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌఖిక ఆదేశాలను జారీ చేయడం వల్లే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూల్చివేతలు నిర్వహించారు. అయితే ఈ కార్యాచరణలో భాగంగా అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటుపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారండి.

Advertisement
Continue Reading

Featured

Ap: ఏపీ రుషికొండ భవనాలపై విమర్శలు.. సంచలన పోస్ట్ చేసిన వైసీపీ!

Published

on

Ap: జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈయన ఋషికొండను తవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా కొండలను తవ్వి సంపదను మొత్తం దోచుకుంటున్నారంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ కు మరింత అందాన్ని రెట్టింపు చేస్తూ అక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మించారు.

ఇక తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు కానీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఈ బంగ్లాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల చేతులలోకి వెళ్లిపోయాయి.

ఇప్పటివరకు ఋషికొండ ప్రాంతంలో కట్టిన ఆ బంగ్లా ఎలా ఉంది అనే విషయాలు బయటకు రాలేదు కానీ మొదటిసారి తెలుగుదేశం పార్టీ నేతలు బంగ్లాలలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఎవరికోసం ఈ బాత్రూములు కట్టించావు అంటూ వైసీపీ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

జగన్మోహన్ రెడ్డి ఎవరికో స్కెచ్ వేసే ఇలా ఖరీదైన బాత్రూం కట్టించారు అంటూ విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై వైసీపీ స్పందించింది.

అవి ప్రభుత్వ భవనాలే..
రిషి కొండల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భవనాలే అవేవీ ప్రైవేట్ భవనాలు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని నిర్మించారు.. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు.. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆదిత్యం ఇవ్వడానికి సరైన భవనం లేకపోవడం వల్లే వీటిని నిర్మించారని కానీ ఇప్పుడు టిడిపి పార్టీ ఈ ఫోటోలను విమర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలిపారు.. టిడిపి వక్ర బుద్ధి అంటే ప్రజలకు తెలుసు అంటూ తెలియజేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!