నగరంలోని ప్రముఖ బేకరీ అయిన కరాచీ బేకరీలో దొంగలు పడ్డారు. లాక్ డౌన్ సమయంలో దొంగలు వీరవిహారం చేయడంపై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు నగర వాసులు. పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మొహంజహి మార్కెట్ చౌరస్తాలో కరాచీ బేకరీ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు విధించడంతో అప్పుడప్పుడు మాత్రమే తెరుస్తున్నారు బేకరీ యాజమాన్యం.

అయితే బుధవారం ఉదయం యధావిధిగా బేకరీని తెరిచిన వచ్చిన యాజమాన్యం లాకర్ తాళం పగలగొట్టి ఉండడం చూసి హవాక్కయ్యారు. అందులో ఉండవలసిన 10 లక్షల నగదు కూడా కనిపించడకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనితో అక్కడకి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వేడ్, క్లూస్ టీం లు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అయితే భవనం మధ్యలో ఉన్న చిన్న సందు నుంచి దొంగలు ప్రవేశించినట్టుగా ప్రాధమికంగా నిర్ధారించారు. వెనుకే పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఇంత ధైర్యంగా ఎలా దొంగతనం చేసారు అనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది బయటివారు చేసిందా లేక తెలిసిన వారిపైనేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

































