వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల జబ్బులను వెంటపెట్టుకొని వస్తాయి. ఈ క్రమంలోనే తరచూ చాలామంది దగ్గు, జలుబు వంటి అనేక వ్యాధుల బారిన పడతారు.ఈ క్రమంలోనే ఇటువంటి అంటువ్యాధులను తట్టుకొనే శక్తి మన శరీరానికి కావాలంటే తప్పకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తి అవసరమవుతుంది.మరి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే సరైన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం..

నారింజ: సిట్రస్ జాతికి చెందిన పండ్లలో ఒకటైన నారింజ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. సిట్రస్ జాతి పండ్లలో ఎక్కువగా విటమిన్ సి లభ్యమవుతుంది. విటమిన్-సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.
పెరుగు: వర్షాకాలం వేసవి కాలలతో మనకి సంబంధం లేకుండా ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వల్ల పెరుగులో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి.ఈ బాక్టీరియాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పూర్తిస్థాయిలో దోహదపడతాయి.
పుట్టగొడుగులు: ఎన్నో పోషక విలువలకు నిలయమైన పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల అనేక పోషక విలువలు శరీరానికి అందుతాయి. పుట్టగొడుగులలో ముఖ్యంగా ప్రొటీన్లు, ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన శరీర బరువును నియంత్రించడానికి ఇది దోహద పడతాయి.
పుచ్చకాయ: పుచ్చకాయలు ఎక్కువగా వేసవిలో మనకు విరివిగా లభిస్తాయి. ఈ విధంగా పుచ్చకాయలను అధిక భాగంలో తీసుకోవడం వల్ల వీటిలో గ్లూటాతియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కీలక పాత్ర వహిస్తుంది. ఇవే కాకుండా బ్రోకలీ,తాజాపండ్లు, ఆకుకూరలు మొదలైన వాటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసి వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులను తరిమికొట్టొచ్చు.




























