ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు,జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో పాటు మనం తీసుకునే ఆహారం మరియు దోమల ద్వారా వ్యాపించే మలేరియా, కలరా, డెంగ్యూ,డయేరియా,చికన్ గున్యా,టైఫాయిడ్ వంటి వ్యాధులనుఎదుర్కోడానికి ప్రజల ఆరోగ్యంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పలు ఆరోగ్య సంస్థలతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విభాగం సూచనల ప్రకారం వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్ వ్యాధులతో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వాటి నుంచి రక్షణ పొందడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలను ప్రజలకు తెలియజేసింది ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
వర్షాకాలంలో మనం తొందరగా వ్యాధి కారకాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మొదట మనఇంట్లోనూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే దోమలు చేరి ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు పాత్రలను శుభ్రం చేసుకోవాలి.వర్షాకాలంలో నిల్వ ఉంచిన ఆహారంలో సూక్ష్మజీవులు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తాజా ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.





























