Connect with us

Featured

Tollywood Heroines: స్టార్ హీరోయిన్లందరూ దుబాయ్ కు వెళ్ళేది అందుకే… హీరోయిన్ల బాగోతం బయటపెట్టిన డైరెక్టర్!

Published

on

Tollywood Heroines: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగాలి అంటే ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది అవకాశాలు రావడమే గగనంగా మారిపోతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరొక ఎత్తు.అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే హీరోయిన్లు తప్పనిసరిగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇలాంటి కమిట్మెంట్లను ఇవ్వడం వల్లే హీరోయిన్లుగా అవకాశాలు వస్తాయి అంటూ ఇప్పటికే ఎంతోమంది ఇదే విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు.ఇలా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కమిట్మెంట్లను ఇస్తూ కొందరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే మరికొందరు హీరోయిన్లుగా అవకాశాలు లేక పలు ఈవెంట్లకు వెళుతూ డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు తరచూ దుబాయ్ వెళుతూ ఉండటం మనం చూస్తున్నాము.

ఇలా దుబాయ్ కి వెళ్లి అక్కడ కొన్ని ఈవెంట్లను చేస్తూ కొందరు డబ్బును సంపాదించుకోగా మరికొందరు మాత్రం అక్కడ ఉన్నటువంటి షేక్ లతో కలిసి వారి సరదాలు అవసరాలు తీరుస్తూ డబ్బును వెనకేసుకుంటున్నారు అంటూ ప్రముఖ డైరెక్టర్ స్టార్ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Tolly Wood Heroines: షేక్ ల అవసరాలు తీరుస్తున్న స్టార్ హీరోయిన్లు…

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నటువంటి హీరోయిన్లకు అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా దుబాయ్ కి వెళ్లి షేక్ లతో సన్నిహితంగా ఉంటూ వారితో సరసాలు ఆడుతూ డబ్బును పోగు చేసుకుంటున్నారంటూ డైరెక్టర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Featured

YS Jagan: లండన్ నుంచి తిరిగి వచ్చిన వైయస్ జగన్.. ముఖ్య నేతలతో కీలక భేటీ?

Published

on

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి లండన్ పర్యటన వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తికాగా 17వ తేదీ ఈయన లండన్ వెళ్లారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు.

ఈయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన నేపథ్యంలో పలువురు కీలక నేతలు విమానాశ్రయంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక జగన్ లండన్ పర్యటన నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ కి దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడంతో వెంటనే ఈయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసిపి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల ఫలితాలపై కొన్ని దిశా నిర్దేశాలు చేశారని తెలుస్తోంది.

Advertisement

మరి కొన్ని గంటలలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న నేపథ్యంలో జగన్ ముఖ్య నేతలతో ఈ భేటీ నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సంస్థలతో సర్వేలు చేయించినటువంటి ఈయన ఈసారి కూడా తమకే అనుకూలంగా ఉందని తను లండన్ వెళ్ళటానికి ముందే వచ్చేది మన ప్రభుత్వమే అని తెలియజేశారు.

వచ్చేది వైసీపీనే…
పలు సర్వేలు వెల్లడించిన ఫలితాలలో 2019 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సీట్ల కంటే మరికొన్ని ఎక్కువగానే రాబోతున్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఘటనలు అల్లర్లు చోటు చేసుకోకుండా ఉండాలని ఈయన నేతలకు సలహాలు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

AP Election Result: అందరి చూపు ఆంధ్ర పైనే.. ఫలితాలు ఎవరికీ అనుకూలం?

Published

on

AP Election Result: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా జూన్ నాల్గవ తేదీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇక కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని వైసిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేయడమే కాకుండా కోట్లలో బెట్టింగులు కూడా కడుతున్నారు.

మరోవైపు జూన్ 9వ తేదీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగబోతున్నాయని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని కూడా చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తామే అధికారంలోకి రాబోతున్నారని చాలా బలంగా నమ్ముతున్నారు.

Advertisement

అధికారం ఎవరిదీ…
ఇకపోతే ఈసారి జరిగిన పోలింగ్ సరళి చూస్తే అంచనాలు వేయడం కూడా కాస్త కష్ట తరమే అని చెప్పాలి. పోలింగ్ భారీ స్థాయిలో పెరగడం దేనికి సంకేతం అన్న విషయంపై అందరూ అయోమయంలో ఉన్నారు. అయితే నేడు సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ ఫలితాలపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్ కి కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Exit Polls: ఉత్కంఠతను రేపుతున్న ఎగ్జిట్ పోల్స్.. ఫలితాలు ఎవరికీ అనుకూలం?

Published

on

Exit Polls: జూన్ నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు వెలబడనున్న నేపథ్యంలోనే అందరి ఆసక్తి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మే 13వ తేదీ ఈ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆధారంగానే అన్ని రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠత భరితంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 6 గంటలకు వెలబడుతున్నాయి. ఇక ఎన్నికల విషయానికి వస్తే ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకు అనుకూలంగా మారుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సంక్షేమ పథకాలు తమ ఐదేళ్ల పరిపాలన ప్రజలకు నచ్చే స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని సంక్షేమ పథకాలే తిరిగి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతాయని వైసిపి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికివారు తామే అధికారంలోకి రాబోతున్నారని చెబుతున్నారు మరోవైపు ఎన్నికలు కూడా వార్ వన్ సైడ్ అనే లాగా జరగలేదు.

Advertisement

ఎవరిది అధికారం..
ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఎవరికి అనుకూలంగా మారాయి.. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాలపై ఎంతో ఆత్రుత నెలకొంది. ఇక ఇప్పటికే ఎన్నో సంస్థలు సర్వేలు చేయగా అన్ని సర్వేలలోనూ వైసీపీకే అధికారం ఉందని చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనేది ఎదురు చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!