టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహంపై గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజగా ఆ రూమర్లకు చెక్ పెడుతూ ఈరోజు ఉదయం నిశ్చితార్ధం చేసుకున్నారు సింగర్ సునీత. గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఆమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో ఈరోజు ఉదయం నిత్సితర్ధం చేసుకున్నారు.

కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే నిరాడంబరంగా నిశ్చితార్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న వయస్సులోనే టాలీవుడ్ లో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చిన్నవయస్సులోనే పెళ్లి కూడా జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లకు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భర్త తీరు నచాకపోవడంతో ఆమె విడాకులు తీసుకున్నారు. అయితే సునీత రెండో వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తా గతకొంతకాలంగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సునీత.

కరోనా నేపధ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జర్గినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులుగా తన పెళ్లి గురించి వార్తలు వస్తున్నా ఆమె స్పందించకపోవడంతో ఈ వార్త నిజమేఅని చాలా మంది భావించారు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. దీని పై స్పందిస్తూ మీ అందరి సుపోర్ట్ కావాలని కోరారు. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయం పై ఆమె ఎటువంటి ప్రకటనా చేయలేదు.

































