తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అంతా సిద్దమైంది. 105పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ విద్యార్థులు చేరుకోవాలి. అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి.

మూడు రోజుల పాటు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరగా నుండగా.. 9, 10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ , మెడికల్ స్ట్రీమ్ సంబంధించిన పరీక్షలు జరగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఒక సెషన్ ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష సెషన్ ఉంటుంది. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థుల కోసం మరోసారి పరీక్షలు నిర్వస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.































