Connect with us

Featured

బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన శైలజ ప్రియ గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలు..

Published

on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైపోయింది.. ప్రతి ఏట జరిగినట్టుగానే గ్రాండ్ గా బిగ్ బాస్ 5వ సీజన్ మొదలు పెట్టారు ఆ షో నిర్వాహకులు. మరోవైపు కంటెస్టెంట్స్ అందరూ తమకు ఎటువంటి ప్లాన్ లేదని.. అసలు గేమ్ ప్లాన్ అంటే తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఎటువంటి ప్లాన్స్ లేకుండానే బిగ్ బాస్ గేమ్ షోకు వచ్చామని.. హౌస్ లోని పరిస్థితులను బట్టి ఏం చేయాలో ఆలోచిస్తామంటూ చెప్పుకొచ్చారు.

ఇక బిగ్ బాస్ అంటేనే అనేక వివాదాలు, గొడవలు రచ్చ రచ్చ.. ఇలాంటి షోలోకి మృదు స్వభావి అయిన మామిళ్ల శైలజ ప్రియ ఎంట్రీ ఇచ్చారు.. 7వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మామిళ్ళ శైలజ ప్రియ సినిమాల్లో అక్క, వదిన, తల్లి, పిన్ని, అత్త పాత్రలో నటిస్తూ అందరికీ సుపరిచితమే.. ఇక ఆమె గురించి తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో మే 20 వ తేదీన, 1978 వ సంవత్సరంలో జన్మించిన మామిళ్ల శైలజా ప్రియ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. 1998లో చిరంజీవి హీరోగా నటించిన మాస్టారు సినిమాలో మొట్టమొదటిగా నటించిన శైలజా ప్రియ అంతకుముందు సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రియసఖి సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన శైలజా ప్రియ పేరు ప్రియ సఖి ప్రియ గా మారిపోయింది. ప్రియా ఓ ప్రియా, ప్రియా నిను చూడలేక సీరియల్ లలో శైలజా ప్రియ నటించి బుల్లితెర స్టార్ నటీమణిగా పేరు తెచ్చుకుంది.

ఆమె వయస్సు 43 సంవత్సరాలు.. 1978 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో జన్మించిన శైలజా ప్రియ 2002వ సంవత్సరంలో ఎం.వి.ఎస్ కిషోర్ ని పెళ్లి చేసుకుంది. 2003వ సంవత్సరంలో ఆమెకు ఒక బాలుడు జన్మించాడు.

ఈటీవీ లో ప్రసారమైన లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, పెళ్లి చేసుకుందాం & జ్వాలా సీరియల్ లో కీలకమైన పాత్రలలో శైలజా ప్రియ నటించింది. జెమినీ టీవీలో ప్రసారమైన డైరీ ఆఫ్ మిసెస్ శారదా, కొత్త బంగారం సీరియళ్లలో నటించింది. మాటీవీ లో ప్రసారమైన మనసా లో దూరదర్శన్ లో వైదేహి సీరియల్లో, జీ టీవీకి చిన్న కోడాలు లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో ప్రసారమైన సీరియల్ నాగమ్మ లో ఈమె నటించింది. ఆమె యేహి హై జిందగీ అనే హిందీ సీరియల్ లో కూడా చేసింది. సన్ టివిలో ప్రసారమైన తమిళంలో వని రాణి సీరియల్ లో కూడా ఆమె నటించింది.

ఆమె ఇప్పటివరకు 60 సినిమాలలో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోహీరోయిన్లు అందరితో కలిసి నటించింది శైలజా ప్రియ. ఆమె చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్, అన్నయ్య సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత, నాగార్జునతో చంద్ర లేఖా, మహేష్ బాబుతో రాజా కుమరుడు, వెంకటేష్ తో జయం మనదేరా మరియు ముఖ్యంగా హిందీ లో సూర్యవంశం సినిమా లో అమితాబ్ బచ్చన్ కూడా కలిసి నటించింది.

2012 లో ఆమె అక్కినేని నాగార్జున యొక్క అత్యంత ప్రశంసలు పొందిన ధమరుకం లో కనిపించింది. ఆమె ప్రభాస్ యొక్క మిర్చిలో రిచా గంగోపాధ్యాయ తల్లిగా నటించింది మరియు కేథరీన్ ట్రెసా పాత్రకు తల్లిగా ఇద్దారామాయిలాతో కనిపించింది. అయితే ఇన్నాళ్ళ సినిమా, సీరియల్ కెరీర్ లో శైలజ ప్రియ పై ఎటువంటి వివాదాలు రాలేదనే చెప్పాలి.. కానీ వివాదాలకి కేరాఫ్ అయిన బిగ్ బాస్ లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక సహజంగానే మృదు స్వభావి అయిన శైలజ ప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎన్నిరోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!