Vijay Devarakonda:విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంది.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు 60 సంవత్సరాలు వచ్చి సినిమాలు మానేసి ఇంట్లో కూర్చున్న ఈ 20 రోజుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని ఎమోషనల్ అయ్యారు. లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా 20 రోజులు దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించాము. ఎక్కడికి వెళ్లిన పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఎంతో ప్రేమతో తనని ఆదరిస్తున్నారని తెలిపారు.
ఈ 20 రోజులలో చూపించిన ప్రేమను తాను 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు. తనపై ఇంత ప్రేమను కురిపించిన అభిమానులకు తాను తప్పకుండా తిరిగి బహుమతి ఇవ్వాలని, గత మూడు సంవత్సరాల నుంచి లైగర్ సినిమా కోసం తాను కష్టపడుతున్నాను ఈ సినిమాని మీ ప్రేమకు కానుకగా నేను ఇస్తున్నాను.

Vijay Devarakonda: విజయ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం…
ఆగస్టు 25వ తేదీ ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతుంది మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అంతకుమించి ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ సినిమా ఇటు పూరి జగన్నాథ్ కెరియర్ లోను అలాగే విజయ్ దేవరకొండ కెరియర్ లోను భారీ బడ్జెట్ చిత్రం కావడం విశేషం. ఇక ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.






























