Vijayendra Prasad: రచయితగా ఎన్నో సినిమాలకు కథలను అందించి ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రచయితగా తెరకెక్కిన బాహుబలి త్రిబుల్ ఆర్ భజరంగి బాయిజన్ వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చాయి. ఇక 80 సంవత్సరాల వయసులో కూడా విజయేంద్ర ప్రసాద్ ఎంతో చురుగ్గా ఉంటూ అద్భుతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇకపోతే ఈయన సినిమా ఇండస్ట్రీలో అందించిన సేవలకు గాను ఈయనకు రాష్ట్రపతి కోటాలో ఏకంగా రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేయబోతున్న సినిమాకి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో పాటు రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాకి కూడా ఈయన కథ సిద్ధం చేస్తున్నారు.

ఇకపోతే ఇదివరకే రజాకార్ల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఇదివరకే ఎంతోమంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమా ముందుకు సాగలేదు.ఈ సినిమా చేయాలని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సినిమా చేయడం కోసం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి.
తాను ఎలాంటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టలేదు…
ఇలా తన గురించి వస్తున్న ఈ వార్తలపై విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ తాను ఈ సినిమాకి దర్శకత్వం వహించలేదని కేవలం కథ మాత్రమే అందిస్తున్నానని తెలిపారు. ఇకపోతే ఈ సినిమాని ఎవరు తీస్తున్నారు ఏమిటి అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తారని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కన్నీళ్లతో బయటకు వస్తారని తెలిపారు.




























