Connect with us

Featured

Virata Parvam Movie Review : విరాటపర్వం సినిమా రివ్యూ….. నక్సలిజం పోరాటంలో అమ్మాయి ప్రేమ కథ ప్రేక్షకులకు నచ్చిందా..?

Published

on

Virata Pravam : నీది నాది ఒకే కథ సినిమా తీసిన వేణు ఉడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ముఖ్య పాత్రాలలో నటించిన ఈ సినిమా జూన్ 17 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా అనేక వాయిదాలు పడిన ఈ సినిమాను తోలుత ఓటీటీ లో విడుదల చేస్తారని అనుకున్న చివరికి థియేటర్స్ లో విడుదల చేసారు. తూము సరళ అనే ఒక నక్సలైట్ నిజం జీవితంలో జరిగిన కథ ఆధారంగా తీసిన చిత్రం కావడంతో మరింత ఇంట్రెస్ట్ సినిమా మీద కలిగింది. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందామా….

Virata Parvam Movie Review : విరాటపర్వం సినిమా రివ్యూ….. నక్సలిజం పోరాటంలో అమ్మాయి ప్రేమ కథ ప్రేక్షకులకు నచ్చిందా….!

కథంతా వెన్నెల చుట్టూనే….

సాయి పల్లవి మెయిన్ లీడ్ గా నటించిన ఈసినిమాలో కథ మొత్తం వెన్నెల అనే అమ్మాయి ప్రేమ కథగా చెప్పొచ్చు. పోరాటాల నడుమ పుట్టిన చిన్నారి సాయి పల్లవి, వెన్నెల (సరళ పేరును మార్చారు ) ప్రేమ కథ ఈ సినిమా. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య కాల్పుల సమయంలో తల్లి ఈశ్వరి రావు కి పుడుతుంది ఇక సాయి పల్లవికి వెన్నెల అని పేరు పెట్టేది కూడా ఒక మహిళ నక్సలైట్ (నీవేదా పితురాజ్ ). పెరిగి పెద్దయ్యాక వెన్నెల నక్సలైట్ అరణ్య అలియాస్ రవన్న పుస్తకాలు చదివి అతన్ని చూడకుండానే ప్రేమలో పడుతుంది. రవన్న ( రానా దగ్గుబాటి ) దళ సభ్యుడు. ఈ విషయంలో తెలియని వెన్నెల తల్లిదండ్రులు ఈశ్వరిరావు, సాయి చందర్ మేన బావ రాహుల్ రామకృష్ణ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇక వెన్నెల రవన్న ను ఇష్టపడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి రవన్న కోసం ఇంటికి నుండి వెళ్ళిపోతుంది. ఇక తాను రవన్నను ఎలా చేరింది, తన ప్రేమను చెప్పి కన్విన్స్ చేసింది అనేది కథాంశం. నక్సలిజం భావాలున్న రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా లేదా అన్నదే సినిమా.

Advertisement
Virata Parvam Movie Review : విరాటపర్వం సినిమా రివ్యూ….. నక్సలిజం పోరాటంలో అమ్మాయి ప్రేమ కథ ప్రేక్షకులకు నచ్చిందా….!

తుపాకీ గొట్టంలో శాంతి లేదు… అమ్మాయి ప్రేమలో ఉంది….

1990- 92 నేపథ్యంలో తెలంగాణ లో సాగే ఈ కథలో వేణు ఉడుగుల తెలంగాణ పల్లె వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో చక్కగా చూపించారు. వేణు ఉడుగుల సొంతంగా డైలాగులు రాసుకోవడం వల్ల కొన్ని డైలాగులు సినిమాలో బాగా పేలాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మా ఊళ్ళల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు, అన్యాయాలు జరిగినపుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు… నోరు లేని సమాజానికి నోరు అందించారు అని సాగే డైలాగు ఆకట్టుకుంది. ఇక దళ నాయకుడిగా రానా నటన ఆకట్టుకుంటుంది. ఇక కథకు మూలమైన వెన్నెల పాత్రధారి సాయి పల్లవి నటన చూపు తిప్పనివ్వదు. ఎంత మంది ఉన్న కళ్ళతోనే హావభావలను పలికించి సాయి పల్లవి ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక దళ సభ్యులుగా నటించిన ప్రియమణి (భారతక్క) నవీన్ చంద్ర ( రఘన్న) గాను ప్రొఫెసర్ శకుంతల గా నందిత దాస్ నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల రవన్న దళాన్ని పోలీసులనుండి తప్పించడానికి చేసే సాహసం గుస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో రవన్న తనతల్లిని కలవడానికి వెళ్ళినపుడు పోలీసులతో యాక్షన్ సన్నివేశం అదిరిపోయింది. ఇక చివర్లో వెన్నెల చనిపోవడం ప్రేక్షకులను కంటతడి పెట్టించి థియేటర్ నుండి బయటికీ రప్పించింది . ఇక సినిమాలో ప్రధాన బలం సంగీతం సురేష్ బొబ్బిలి అందించిన పాటలు కథతో పాటు సాగేవిగా ఉండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. నేపథ్యం సంగీతము బాగుంది. ఇక ఎమోషనల్ సన్నివేశాలు ఎంత కన్నీరు పెట్టించాయో యాక్షన్ సన్నివేశాలు అంతలా ఆకట్టుకున్నాయి. దర్శకుడు కథను ఎక్కడ కమర్షియల్ వాసన రానివ్వకుండా కథను ఎలా చెప్పాలనుకున్నాడో అలానే చెప్పాడు.

Virata Parvam Movie Review : విరాటపర్వం సినిమా రివ్యూ….. నక్సలిజం పోరాటంలో అమ్మాయి ప్రేమ కథ ప్రేక్షకులకు నచ్చిందా….!

తెలంగాణ పల్లె అందాలు, అడవుల సౌందర్యాన్ని చక్కగా చూపించారు. దివాకర్ మణి, డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఓకే అనేలా ఉంది. ఓవరాల్ గా నక్సలిజం నేపథ్యంలో తెలుగులో చాలా కథలే వచ్చిన ఇదొక కొత్త ప్రయత్నమనే చెప్పాలి. కథ పరంగా ఇంకా యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నా దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేయలేదనిపిస్తుంది. ఇక సినిమాలో ఎందుకు వెన్నెల రవన్న ప్రేమలో పడిందో బలమైన కారణం చెప్పలేదు. ఒక మీరాబాయి కృష్ణుడు కోసం ఎలా చేసిందో అలా వెన్నల రవన్న కోసం ఇంటినుండి వెళ్ళిపోయి కష్టాలు పడిందని దర్శకుడు పోల్చి చెప్పే ప్రయత్నం చేసాడు. మొత్తానికి సినిమా కమర్షియల్ కథ కోరుకునే వారికి నచ్చక పోవచ్చు అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!