Virupaksha Movie: సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. థియేటర్లలో 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడమే కాకుండా ఈ సినిమాలో సంయుక్త మీనన్ రవి కిషన్ విలన్ పాత్రలలో నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో సంయుక్త మీనన్ నటించినప్పటికీ ఈ సినిమా కథ రాసేటప్పుడు విలన్ పాత్రలో సంయుక్తను కాకుండా మరొక నటిని తీసుకోవాలని డైరెక్టర్ భావించారట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ కార్తీక్ దండు ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సినిమా కథ రాసేటప్పుడు ఇందులో విలన్ పాత్రలో నటించడానికి యాంకర్ శ్యామలను అనుకున్నాము. ఇందులో ఈమె హీరో అక్క పాత్రలో నటించారు. అయితే కథ మొత్తం పూర్తి అయిన తర్వాత స్క్రిప్ట్ సుకుమార్ గారికి వినిపించగా ఆయన కొన్ని మార్పులు చేశారని కార్తీక్ వెల్లడించారు.

Virupaksha Movie: సుకుమార్ సూచనల మేరకే మార్పు…
స్క్రిప్ట్ మొత్తం చదివిన సుకుమార్ విలన్ పాత్రలో శ్యామల ఉండగా ఆయన మాత్రం శ్యామల పాత్రను చంపేస్తూ సంయుక్తను విలన్ గా చేశారని కార్తీక్ దండు వెల్లడించారు. ఇలా సుకుమార్ గారి సూచనల మేరకే తాను సంయుక్తను విలన్ గా చూపించామంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































