Puspha Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయి బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ పుష్ప మానియా కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమాపై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తండ్రిగా ప్రముఖ సినీ రచయితగా విజయేంద్రప్రసాద్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. బాహుబలి, త్రిబుల్ ఆర్, బజరంగీ భాయ్ వంటి అద్భుతమైన చిత్రాలకు కథను అందించిన రచయితగా విజయేంద్రప్రసాద్ మంచి గుర్తింపు పొందారు.

సినిమా విజయవంతం కావాలంటే కథ కీలకమైనది. అలాంటి కథను అందించడంలో విజయేంద్రప్రసాద్ సహజ సిద్ధుడు. ఈ సందర్భంగా ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కథను అందించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ ఉంటుందని తెలిపారు.
సినిమా సినిమాకి కొత్తదనం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు తనకు ఎంతగానో నచ్చుతాయని ఆయన వెల్లడించారు. కథను చెప్పడంలో సుకుమార్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక సినిమాకి మరొక సినిమాకి సుకుమార్ ఎంతో కొత్తదనం చూపిస్తారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా చూస్తూ నేను వణికిపోయాను. ఆ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుందంటూ విజయేంద్రప్రసాద్ పుష్ప సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక ఒక రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్రప్రసాద్ మరో సినిమా గురించి ఇలా మాట్లాడటంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


























