బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్స్తో మొదలు కాగా, ఇందులోఉన్న కంటెస్టెంట్స్ మధ్య బాండింగ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రతి రోజు ఏవో కొట్లాటలు, గోలలు తప్ప సరదాగా ఉన్నట్టు కనిపించడం లేదు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పోటీ పడి మరీ గొడవలకు దిగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు.

దానికి అర్హులుగా ఉన్నవాళ్లు యాంకర్ రవి, మానస్, కాజల్, హమీదా, జెస్సీ మరయ సరయు ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లు యాంకర్ రవి మరియు కాజల్. బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ రవి.
అతడికి ఎక్కువగానే ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక డబ్బింగ్ ఆర్టిస్టుగా.. యాంకర్ గా తన రేంజ్ లో ఒక గుర్తింపు తెచ్చకున్న కాజల్ కు కూడా బాగానే ఒట్లు పడ్డట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఈ వారం సేఫ్ జోన్ లో ఉన్నారు. అయితే మానస్ మరియ జెస్సీ విషయానికి వస్తే.. సీరియల్ నటుడిగా పేరుతెచ్చుకున్న మానస్ , మోడల్ జశ్వంత్ అమాయకంగా కనిపిస్తూ సింపతి ఓట్లను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక మిగిలిన సరయు, హమిదా విషయానికి వస్తే.. హౌస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించడం లేదు. దీంతో వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలిమినేట్ అయిన తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీతో జబర్దస్త్ వర్ష లేదా యాంకర్ వర్షిణిలో ఎవరో ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.


































