బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన ఈషో ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్ లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు అభయ హస్తం అనే టాస్క్ ఇచ్చారు. ఇక ఈ ఛాలెంజ్ లో గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం తోపాటుగా ఇంట్లోకి ప్రవేశిస్తారని తెలిపారు. ఇక ఈ ఛాలెంజ్ ని ఐదుగురు హౌస్ మెట్ కు బిగ్ బాస్ ఇచ్చాడు.

అయితే ఇప్పటికే ఈ టాస్క్ ముగ్గురు హౌస్ మేట్స్ ఈ చాలెంజ్ చేసి గెలిచి తమ సత్తాను చాటుకున్నారు. ఇందులో షణ్ముఖ్ జస్వంత్,సిరి, శ్రీరామ్ చంద్ర లు ఉన్నారు. మరొక రెండు రాష్ట్రాలలో మానస్, జస్సిలు కూడా గెలిచినట్లు సమాచారం. ఐదుగురు తో పాటుగా అనీ మాస్టర్ కూడా లిస్టు లోకి రావడంతో మొత్తంగా ఆరుగురు కెప్టెన్సీ కోసం పోటీపడతారు.
వీరు మూడు జంటల గా విడిపోయి టాస్క్ లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్, మానస్ కలసి కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లాక్ అయిన తర్వాత ఛాలెంజ్ చేసిన హౌస్ వైఫ్ ఎవరు పోటీ చేయాలనే దానిపై బాగా కసరత్తులు చేశాడు. ఇందులో ఫస్ట్ బ్యాచ్ లో లోబో, షణ్ముఖ్ వస్తే, ఆ తర్వాత సిరి, రవి తో తలపడి గెలిచింది.
అనంతరం మానస్, శ్రీ రామ్ లు రోప్స్ గేమ్ ఆడారు. ఈ రోప్స్ గేమ్ లో విజయం సాధించిన శ్రీరామ్ కెప్టెన్సీ పోటిదారులుగా ఎన్నికయ్యాడు. ఇక అందరూ మానస్ కి మరో ఛాన్స్ వచ్చిందని అందులో గెలిచాడని చెబుతున్నారు. ప్రియాంక శాక్రిఫైజ్ చేస్తే మానస్ వచ్చాడా లేక మానస్ కి మరో ఛాన్స్ కెప్టెన్ సన్నీ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరగబోతోంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.



























