గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి బాధితులను ఎన్నో సమస్యలకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి.తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న బాధితులలో మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా ఓ అధ్యయనంలో నిపుణులు వెల్లడించారు.

కరోనా వైరస్ మన శరీరంలోకి వ్యాప్తి చెందగానే శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపినట్టే మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అధ్యయనంలో భాగంగా కరోనా సోకిన బాధితులు క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం, ఏదైనా ఒక పని పై శ్రద్ధ చూపకపోవడం, తీవ్రమైన గందరగోళం అధిక తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఈ విధమైనటువంటి లక్షణాలు కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత బాధితులలో తలెత్తుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ విధంగా వైరస్ శరీరంలో ఇతర భాగాల పై దాడి చేసినట్లు మెదడుపై ప్రభావితం చేసే మార్గాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. వైరస్ మన శరీర భాగాలలోకి వ్యాపించినట్లు మెదడులోకి చొరబడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి మెదడు సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిపారు.
ఈ వైరస్ కారణంగా శరీరంలో ఎదురయ్యే శారీరక మార్పులు కారణంగా మెదడు పని చేయక పోవడానికి కారణం అవుతుందని తెలిపారు. ఇలా పలు కారణాల చేత కరోనా నుంచి కోలుకున్న తరువాత కొందరిలో ఈ విధమైనటువంటి మెదడు సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని నిపుణులు వెల్లడించారు.































