కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉండలేక ఏ పని లేకుండా తిరుగుతున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన అందరిని షాక్ కి గురిచేస్తుంది. పత్రాలు అడిగినందుకు ఏకంగా పోలీసునే కారుతో ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.

వివరాల్లోకి వెళితే… పంజాబ్ రాష్ట్రం జలంధర్ సమీపంలోని మిల్క్ బార్ చౌక్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అటు ఒక కారు రావడంతో ఏఎసై ముల్క్ రాజ్ ఆ కారును ఆపి పత్రాలు చూపించమని అడిగారు. ఆ సమయంలో ఏఎస్సై కారు బానెట్ పై చేతులు పెట్టి అడ్డగా నిలిచిని అడిగారు. దీనితో ఆ కారు డ్రైవర్ ఎలాగైన తప్పించుకోవాలని ఆ కారును వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. ఆ కారు ముందున్న ఏఎస్సై కూడా కారు బానెట్ పై ఉండిపోయారు. అయినా సరే పట్టించుకోకుండా అలాగే ఈడ్చుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు.

అయితే జరుగుతన్న విషయాన్నీ గమనించిన స్థానికులు ఆ కారును ఆపి, డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో ఏఎస్సై కు స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. అక్కడే ఉన్న ఒక యువకుడు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.































