కరోనా వ్యాక్సిన్ల విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ పై మరోసారి ద్వజమెత్తారు వైయస్ షర్మిల. ప్రభుత్వానికి దొరకని టీకాలు ప్రైవేటు వారికి ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నిచారు షర్మిల.

“కేసీఆర్ సారూ.. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునెందుకా ? ఇంకెన్నాళ్ళు దోరా ఈ మూతకండ్ల పరిపాలన ? టీకా తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం టీకాలు దొరకడం లేదా ? అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫస్ట్ దోస్ బందుపెట్టి నేలరోజులైంది. కానీ ప్రైవేటుకు మాత్రం దొరుకుతున్నాయి. అంటూ ప్రశ్నించారు.

































