మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా కొత్త రూపు దాల్చిన డెల్లా ప్లస్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతుండటం.. దీనితో పాటుగా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్న క్రమంలో మరోసారి లాక్డౌన్ ఆంక్షలను కఠినం చేశారు. ఈ నేపద్యంలో ఇంతకు ముందు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో మొదటి రెండు దశలను రాజాగా రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలోని దుకాణాలు అన్నీ సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. అనంతరం మహారాష్ట్ర మొత్తం కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఇక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆంక్షలు జూన్ 28 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.


































