Connect with us

Featured

ఎస్‌ వీ.రంగారావు.. సూపర్ స్టార్ కృష్ణతో ఏమని ఛాలెంజ్ చేసారో తెలుసా?

Published

on

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పేరున్న సంగతి తెలిసిందే. తేనె మనసులు సినిమా నుంచి కృష్ణ ఏ సినిమా చేసినా ఒక్కసారి కథ నచ్చితే మళ్ళీ దానిగురించి ఏమాత్రం ఆలోచించరు. ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త ప్రయోగం చేయాలన్నా కృష్ణ ముందు ఉండేవారు. ఆయనలాగా అప్పటి తరంలో ఉన్న ఏ హీరో అంత ధైర్యం చేసేవారు కాదని ఎన్నో సందర్భాలలో ప్రముఖులు చెప్పిన సందర్భాలున్నాయి. 10 ఏళ్లలో 100 కి పైగా సినిమాలు చేసిన రికార్డ్ తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం కృష్ణకి మాత్రమే ఉంది. అందుకే ఆయన 350 పైచిలుకు సినిమాలు చేశారు.

హీరోగా మంచి క్రేజ్ మీదున్న కృష్ణ ఆ తర్వాత తన సోదరులతో కలిసి నిర్మాణ సంస్థను.. స్టూడియోను ప్రారంభించి సొంతగా సినిమాలు నిర్మించారు. సూపర్ హిట్స్ అందుకుంటున్న కృష్ణ ఇందులో భాగంగా పండంటి కాపురం సినిమాను నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మల జంటగా నటించారు. ఈ సినిమాను హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన సునెహ్రా సన్సార్ అనే సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. బాలీవుడ్ లో ఈ సినిమా ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో అంత బ్లాక్ బస్టర్ హిట్ గా తెలుగులో నిలిచింది. ఈ సినిమా కృష్ణ కెరీర్ లో ఓ గొప్ప సినిమాగా నిలిచింది.

ఎస్ వీ రంగారావు గారు ఓ రోజు షూటింగ్ కి రాలేదట.

Advertisement

ఈ సినిమాకి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. ఎస్ పి కోదండపాణి సంగీతం అందించిన ఈ సినిమాను జయప్రద పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఎస్ వీ రంగారావు, జమున, గుమ్మడి, అంజలీ దేవీ, ప్రభాకర్ రెడ్డి, బి. సరోజా దేవీ లాంటి అగ్ర తారలు ఇందులో నటించారు. ఇంత భారీ తారాగణం నటించిన ఈ సినిమాకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమాకి ఓ మేకప్ మేన్ గా పనిచేసిన మాధవరావు గారు ఓ సందర్భంలో వెల్లడించారు. ఇందులో నటించిన ఎస్ వీ రంగారావు గారు ఓ రోజు షూటింగ్ కి రాలేదట.

అందుకు కారణం ఆయన వైన్ తీసుకోవడం వల్ల షూటింగ్ కి వచ్చే ఓపిక లేక రాలేదట. అప్పటికే సెట్‌లో కృష్ణ, విజయ నిర్మళ, జమున, గుమ్మడి, అంజలీ దేవీ, ప్రభాకర్ రెడ్డి, బి. సరోజా దేవీ ..ఇలా ప్రధాన తారాగణం మొత్తం ఉన్నారట. కాంబినేషన్ సీన్ కావడంతో ఆరోజు షూటింగ్ కి తప్పకుండా ఎస్ వీ రంగారావు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన రాలేకపోయారట. షూటింగ్ ఆగిపోవడంతో వేరే వారితో కబురు పెడితే కూడా ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేయండ్రా అని అన్నారట. దాంతో ఈ విషయం సెట్ లో ఉన్న వాళ్ళకి తెలిసి ఇబ్బంది పడ్డారట.

గుమ్మడిగారు …కాస్త కోపంతో ఆయన తప్ప మరెవరూ లేరా అని అన్నారట.

అంతేకాదు గుమ్మడిగారు …కాస్త కోపంతో ఆయన తప్ప మరెవరూ లేరా..ఇలా చేస్తున్నాడనే కదా హరనాథ్ ని అవైడ్ చేశాము ఇండస్ట్రీ నుంచి ..ఎందుకు ఎస్ వీ రంగారావునే తీసుకున్నారు అని అన్నారట. ఆ విషయం తీసుకువెళ్ళి ఎస్ వీ రంగారావు మేకప్ మేన్ చెప్పారట. ఈ మాటకి కృష్ణ గారు నాకు అవన్నీ తెలుసండీ ..అయినా ఆయననే ఎందుకు తీసుకున్నానంటే .. ఈ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరని. ఆప్షన్ ఉన్నా ఎస్ వీ రంగారావు చేసినట్టుగా మరెవరూ చేయలేరూ అని. ఇదంతా ఎస్ వీ రంగారావు కి తన పర్సనల్ మేకప్ మేన్ చెప్పాడట.

దాంతో వెంటనే ఎస్ వీ రంగారావు ..మాధవరావుకి ఫోన్ చేసి రేపు నేను వస్తాను.. నువ్వు కృష్ణగారికి చెప్పి ఇప్పటివరకు జరిగిన రష్ మొత్తం చూద్దామని చెప్పారట. ఈ విషయం కృష్ణకి చెప్పగానే ఆయన సరేనని మానేజర్ కి చెప్పి ప్రివ్యూ ఏర్పాటు చేయమన్నారట. ఎస్ వీ రంగారావు – కృష్ణ – మాధవరావు కలిసి ప్రివ్యూ చూసి బయటకి వచ్చి ఎస్ వీ రంగారావు ..కృష్ణగారితో ఒకటే అన్నారట..కృష్ణ ఇప్పటి వరకు తాగి చేసిన రంగారావును చూశారు..ఇప్పుడు తాగకుండా చేసే రంగారావును చూస్తారు. ఈ సినిమా చూసి బయటకి వెళ్ళే ప్రేక్షకుడు నన్ను తలుచుకుంటూ వెళ్ళాలి..చూడు ఛాలెంజ్ అన్నారట.

ప్రతీ ప్రేక్షకుడు ఎస్ వీ రంగారావును తలుచుకుంటూ వెళ్ళారట.

అలాగే అంత గొప్పగా చేశారట ఎస్ వీ రంగారావు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఎస్ వీ రంగారావును తలుచుకుంటూ వెళ్ళారట. ఇలా ఎస్ వీ రంగారావు – కృష్ణల మధ్య జరిగిన ఓ సంఘటనను ప్రముఖ మేకప్ మేన్ మాధవ గారు వెల్లడించారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇందులో చాలా జరిగాయట. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి గొప్ప పేరు తీసుకు వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాకి అభిమానులున్నారంటే అతిశయోక్తి లేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!