స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టిడిపి నేత అచ్చెన్నాయుడు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి.. సీఎం జగన్ రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ ..ప్రతి ఒక్కరి పై కేసులు పెట్టి వేధిస్తున్నారని అచ్చం నాయుడు ధ్వజమెత్తారు. జగన్ పాలన కంటే బ్రిటిష్ పాలన బాగుండేదని.. ఏపీ ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. టిడిపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

































