నటి మీరా మిథున్ వివాదంలో చిక్కుకున్నారు. సినిమా షూటింగ్ పూర్త కాకముందే ఎవరికి చెప్పకుండా చెక్కేసింది ఈ భామ.. దీంతో ఆమె నటిస్తున్న సినిమా వివాదంలోకి వెళ్లింది. వివరాల్లోకి వెళితే మీరా మిథున్ నటించిన చిత్రం పేయ కానోమ్.

గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తేని భారత్ ఆర్.సురుళివేల్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మీరాతో పాటు నటుడు కౌశిక్, సంధ్య రామచంద్రన్, కోదండం, ఫైట్ మాస్టర్ జాగ్వార్ తంగం ప్రధాన పాత్రలు పోషించారు. సెల్వ అన్భరసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కాగా సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయిన తర్వాత మీరా మిథున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు, అనంతరం జైలులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మిగిలిన 20 శాతం షూటింగ్ ను కొడైకెనాల్ లో చిత్రీకరించారు.
అయితే మరో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందనే సరికి ఎవరికి చెప్పకుండా తనతో వచ్చిన ఆరుగులు వ్యక్తులతో ఈ అమ్మడు చెక్కేసిండి. దీంతో ఆమె లేకుండానే కథను మార్చి చిత్రాన్ని పూర్తి చేశామని డైరెక్టర్ వెల్లడించారు. ఈ అమ్మడు చేసిన పనిలో టోటల్ మూవీ రిస్క్ లో పడింది. దీంతో ఆమె క్యారెక్టర్ లేకుండానే సినిమాను మళ్లీ చిత్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

































