Ajay Ghosh : డిడి దూరదర్శన్ లో తన ప్రయాణం మొదలు పెట్టిన అజయ్ ఘోష్ ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. ‘ప్రస్థానం’ సినిమాతో మొదలు పెట్టి రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజ వంటి చాలా సినిమాల్లో నటించిన అజయ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఎక్స్ ప్రెస్ రాజా, విశారనై, అమ్మోరు తల్లి సినిమాలు. ఇక ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాలో తన నటనతో మరింత అభిమానులను సంపాదించుకున్నారు. తమిళంలో వచ్చిన ‘విశారనై’ సినిమా తెలుగులో ‘విచారణ’ పేరుతో డబ్ అయింది. ఈ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్. ఇక పుష్ప సినిమాతో అజయ్ ఘోష్ క్రేజ్ వేరే లెవెల్ కి పోయింది. ఇపుడు మంచి ఆఫర్స్ తో పలు భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు.

విష్ణు కి తెలిస్తే ఇక అంతే…
ప్రస్తుతం తెలుగులో మంచి పాత్రలను చేస్తూ బిజీగా ఉన్న అజయ్ ఘోష్ పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నట్లు చెప్పారు. నా కెరీర్ కి ఉపయోగపడే పాత్ర అయితేనే చేస్తున్నట్లు వివరించారు. ఇక మా అసోసియేషన్ లో సభ్యత్వం గురించి ప్రశ్న ఎదురైనపుడు ఇంకా మా అసోసియేషన్ సభ్యత్వం తీసుకోలేదు, ఇపుడు తీసుకోవాలి ఈ విషయం గనుక విష్ణు, మోహన్ బాబుకి తెలిస్తే ఇక అంతే నన్ను ఉతికారేస్తారు అంటూ చమత్కరించారు. పుష్ప సినిమా తరువాత ఏమి ఆలోచించాలో, ఎలా ప్రయాణం కొనసాగించాలో ఏమి అర్థం కావడంలేదు. అందుకే నెమ్మదిగా సినిమాల విషయంలో ఎంపిక చేసుకుంటున్నాను.

ఇక జీవితంలో ఇన్నేళ్ల ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయం ఒక్కటే అన్ని బంధాలు అన్ని అనుభవాలు మనకు ఉండాలి కానీ తామరాకు మీద నీటి బొట్టులా సాగిపోతు ఉండాలి, ఎవరినీ నొప్పించకూడదు, ఎవరి మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోకూడదు అంటూ చెప్పారు. ఇక రాజకీయాల వైపు వస్తానని, కమ్యూనిజం భావజాలం ఎక్కువగా ఉండటం వల్ల సమాజానికో కళాకారుడిగా ఎంతో కొంత ఉపయోగపడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జనసేన లో చేరుతారా అనే ప్రశ్నకు చెప్పలేను ఆ సమయానికి అలా జరగలనుంటే జరుగుతుంది అంటూ చెప్పారు.
































