Anurag Kashyap: ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కుమార్తె గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సాధారణంగా మనం ప్రభుత్వానికి లేదా ఏదైనా ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే తప్పనిసరిగా మనకు ఇతరుల నుంచి బెదిరింపు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే తన కుమార్తెకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని ఆ సమయంలో తన గుండెపోటు వచ్చిందనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యతిరేకత తెలుపుతూ నిరసనలు చేశారు. ఈ నిరసన ఉద్యమంలో భాగంగా తన కుమార్తె కూడా పాల్గొన్నదని ఈయన వెల్లడించారు. 2014 ముందు వరకు అక్రమంగా బౌద్దులు, ముస్లీములు, హిందువులు, క్రైస్తవులు, పార్శీలు మెుదలైన విదేశీయులు చొరబడ్డారు. అలాంటి వారందరిని పారద్రోలడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తన కుమార్తె కూడా పాల్గొనడంతో చాలామంది తన కుమార్తెను రేప్ చేసి చంపుతామంటూ బెదిరించారని అలా తనని బెదిరించడంతో ఆమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని అనురాగ్ తెలియచేశారు.అలా తన కుమార్తెకు బెదిరింపులు రావడంతో తణుకు కూడా గుండెపోటు వచ్చిందని తాజాగా ఈయన ఈ విషయాన్ని బయట పెట్టారు.

Anurag Kashyap: కూతురిని చూస్తే గర్వకారణంగా ఉంటుంది…
తన కూతురు డిప్రెషన్ లో ఉండడం చూసి తనకు గుండెపోటు రావడంతో తాను తన ట్విట్టర్ ఖాతాని తొలగించి 2019లోపోర్చుగల్ వెళ్ళామని తెలిపారు. అయితే తన కూతురికి ఇలాంటి బెదిరింపులు వచ్చిన తను ఏమాత్రం వెనకడుగు వేయకుండా తిరిగి తన పనిలో తాను నిమగ్నమయ్యారని,ఈ విధంగా తన కూతుర్ని చూస్తే తనకు చాలా గర్వకారణంగా ఉంటుందంటూ ఈయన తన కుమార్తె గురించి తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి తెలియజేశారు.

































