ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. పదోతరగతి పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోరు.

దీనితో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుత పరిస్తితుల్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన తమకు లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి కరోనా వ్యాక్సిన్లు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై పూర్తీ వివరాలు కోరిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.






























