తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి యాషిక ఆనంద్ తమిళ ప్రేక్షకులను బాగా సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈమెకు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా ఈ నటి ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈమె కారు యాక్సిడెంట్ కి గురవడంతో ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించినట్లు తెలుస్తోంది. అసలు కారు ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే…

నటి యాషిక ఆనంద్ తన ఇద్దరు మగ స్నేహితులతో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కారు తమిళనాడులోని మామల్లపురం సెంటర్ మీడియన్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వల్లిచెట్టి భవానీ అనే మహిళ దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో నటి యాషిక ఆనంద్ తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా నటి యాషిక ప్రమాదానికి గురైందని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక ప్రమాదంలో మృతి చెందిన మహిళ శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అన్న కోణంలో కేసు విచారణ చేపడుతున్నారు. నటి మద్యం సేవించి వాహనం నడపారా అన్న కోణంలో కూడా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇక నటి యాషిక ఆనంద్ విషయానికి వస్తే మోడల్, టీవీ నటి గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ బ్యూటీ 2016లో ధురువంగల్ పత్తినారు సినిమా ద్వారా వెండితెరపై తళుక్కుమన్నారు. అదే విధంగా పలు తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ త్రీ లో పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.































