Connect with us

Featured

తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ బామలు ఎంత డిమాండ్ చేస్తున్నారు !

Published

on

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు భారీగా క్రేజ్ ఉంటుంది వాళ్ళని చూసే జనాలు సినిమా థియేటర్ కి వస్తారు అలాగే సినిమా కొన్ని సినిమాలు సైతం బాగా లేకపోయినా వాళ్ల క్రేజ్ తో ఆడిన సినిమాలు సినిమా ఇండస్ట్రీలో చాలానే ఉంటాయి అయితే సినిమాలో దర్శకుడు ఎవరు అనేది దానికంటే ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అనే దాని పైనే సినిమా సక్సెస్ అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సినిమా స్క్రీన్ పై ఆడియన్స్ కి కనబడేది హీరో హీరోయిన్ మాత్రమే కాబట్టి వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది.

తెలుగులో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు లాంటి హీరోలు వాళ్ల రేంజ్ లో సక్సెస్ ఫుల్ హీరోలుగా దూసుకుపోయారు అలాగే హీరోయిన్లుగా ఉన్న సావిత్రి, వాణిశ్రీ, జమున, జయప్రద లాంటివారు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో రాణించారు అయితే అందరిలో ఒక డౌట్ మాత్రం అలాగే ఉండిపోతుంది ఏంటంటే హీరో హీరోయిన్లు సినిమాల్లో ఎంత తీసుకుంటారు అని దానిపైన తెలుగులో మార్కెట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకి ఇచ్చే రెమ్యూనరేషన్లు కూడా తక్కువగా ఉండేవి కాని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోలు వాళ్ళ క్రేజ్ ని ఇండియా మొత్తం విస్తరింపజేశారు.

అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలియా భట్, దీపికా పదుకొనే లాంటి వారికి మాత్రం సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది అలాంటి హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ని తీసుకున్నారు. అయితే సౌత్ లో దర్శకులను నమ్మకపోయినా అలియాభట్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆమెకి రోజుకి 50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే తన స్టాఫ్ కి రోజుకు లక్ష రూపాయలు ఇస్తూ ఆవిడ హోటల్ కి సంబంధించిన ఫుడ్ కు సంబంధించిన డబ్బులను కూడా అదనంగా ఇస్తున్నారు. దాంతో ఆమె షూటింగ్ కి వచ్చారు సినిమా మొత్తంలో ఆమె షూటింగ్ 10 నుంచి 12 రోజులు ఉండడంతో ఆమెకి 5 నుంచి 6 కోట్ల వరకు డిమాండ్ చేశారు రాజమౌళి స్ట్రాటజీ ప్రకారం ఆమెకి ఐదారు కోట్ల వరకు చెల్లించినప్పటికీ ఆ సినిమాలో ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండడంతో ఆవిడ మీద పెట్టిన డబ్బులు మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తుంది అనే ధీమాతో ఉన్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేయబోయే సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం దీపిక పదుకొనే దాదాపు ఎనిమిది కోట్ల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ లో విపరీతంగా పాపులర్ అయిన ఈ హీరోయిన్లు మాత్రం సౌత్ లో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. స్టార్ దర్శకుడిగా పేరు పొందిన దర్శకుల సినిమాల్లో మాత్రమే నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇంతకు ముందు దీపికా పదుకొనే జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన లవ్ 4 ఎవరులో ఒక స్పెషల్ సాంగ్ లో చేసినప్పటికీ ఆ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు… ప్రస్తుతం ఆమె ప్రభాస్ పక్కన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దీపికా పదుకొనే అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!