Breaking: ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు వరుసగా మరణించడంతో చిత్ర పరిశమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక నటుడి మరణం మర్చిపోకముందే మరొక నటుడు మరణించడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు లోహితస్వ ప్రసాద్ నేడు కన్నుమూశారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో లోహితస్వ ప్రసాద్ ఎన్నోఅద్భుతమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఈయన సుమారు 500 కు పైగా సినిమాలలో నటించడమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోనే మరణించారు.

Breaking:
ఇక ఈయన కుమారుడు కూడా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈయన బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో NIA ఆఫీసర్ పాత్రలో నటించారు. అలాగే ఎన్టీఆర్ త్రిపాత్రభినయంలో చేసిన జై లవకుశ సినిమాలో కూడా నటించారు.ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లోహితస్వ ప్రసాద్ మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఈయన మరణ వార్త పై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు.


































