Connect with us

General News

Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

Case On Fish: ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడిని చేప చంపేసింది. వినడానికి వింతగా ఇన్నా ఇదే నిజం.

Published

on

Case On Fish: ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన మత్స్యకారుడిని చేప చంపేసింది. వినడానికి వింతగా ఇన్నా ఇదే నిజం. ఈ చేపపై పోలీసులు కేసు కూడా పెట్టడం మరో సంచలనంగా మారింది. ఏన్నో ఏళ్లుగా వేటకు వెళ్తున్న ఇటువంటి సంఘటన ఎదురుకాలేదని మత్స్యకారులు చెబుతున్నారు.

Case On Fish: ఇదేందయ్యా సామి...చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?
Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

ఈ ఘటన విశాఖ సముద్ర తీరంలో చోటు చేసుకుంది. సముద్రంలో ఉండే కొమ్ము చేప మహా డేంజరెస్. అలాంటి చేప దాడిలోనే మత్స్యకారుడు మరణించాడు. ఈ చేపపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎటాంటి చర్య తీసుకుంటారో అని ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం చేపపై హత్యా నేరం నమోదు చేశారు విశాఖ పరవాడ పోలీసులు. 

Case On Fish: ఇదేందయ్యా సామి...చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?
Case On Fish: ఇదేందయ్యా సామి…చేపపై కేసు నమోదు..! ఎందుకో తెలుసా..?

మనుషులపై దాడి చేసి తన పదునై కమ్ముతో చంపేయడం కొమ్ము చేప ప్రత్యేకత. ఇది విశాఖకు దాదాపు ఎనబై నాటికల్ మైళ్ల దూరంలోనే ఈ కొమ్ము చేపలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయనే వార్తలు ప్రస్తుతం మత్స్యకారులను కలవరపెడుతోంది. 


జోగన్న అక్కడే మరణించాడని..

అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేదానిపై వేటకు వెళ్లిన మిగతా మత్స్యకారులు  వివరాలు వెల్లడించారు. విశాఖ పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్య్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేపల కోసం వల వేశారు. మరసటి రోజు ఉదయం 8 గంటలకు వలలో పెద్దచేపలు చిక్కాయి. ఆ సమయంలో వలను పైకి లాగే ప్రయత్నం చేశారు. బరువు చాలా ఎక్కువగా ఉండటంతో మత్య్సకారులకు కష్టమైంది. ఈ సమయంలోనే వల పడవకు చిక్కుకుంటే చిరిగే అవకాశం ఉండటంతో జోగన్న అనే మత్స్యకారుడు నీటిలోకి దిగాడు. ఈ సమయంలోనే కొమ్ముకోనెం చేప జొగన్న డొక్కలో తన ముక్కుతో పొడించింది. తీవ్రగాయం అయిన జోగన్న అక్కడే మరణించాడని తోటి మత్స్యకారులు తెలిపారు. ఈ ఘటనను విచారించిన పోలీసులు.. తోటి మత్స్యకారులను కూడా విచారించి కోమ్ముకోనెం చేపే జోగన్నను చంపిందని నిర్థారణకు వచ్చారు. చేపపై కేసు నమోదుచేశారు. జోగన్న మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ హించారు. మత్య్సకారులతో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు సమావేశం నిర్వహించారు. కనీసం రక్షణ లేకుండా సముద్రంలోకి ఎలా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Featured

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Published

on

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Continue Reading

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!