కరోనా మహమ్మారి గత 2020 మార్చి నుంచి మన దేశంలో కుణుకు లేకుండా చేస్తోంది. మొదటి వేవ్ లో కరోనా కేసులు పెరిగినా మరణాలు సంభవిచలేదు. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవ్వడమే కలవరపెడుతోంది. అయితే దీనికి వ్యాక్సిన్ వచ్చినా కొంత మందికి అపోహలు మాత్రం తొలగిపోలేదు. ఇందులో భాగంగానే చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది. కరోనా సోకిన తల్లి.. తన శిశువుకు పాలు ఇవ్వాచ్చా.. ఇవ్వకూడదా.. అనేది చాలా మందికి తెలియదు. అయితే తాజాగా చేసిన పరిశోధనలు కొన్ని కీలక విషయాలు భయటకు వచ్చాయి. దీనిపై ఒక క్లారిటీని ఇచ్చారు.

కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వవచ్చు అని ఆ పరిశోధనలో తేలింది. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో ప్రసూతి, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మంజు పూరి ఇలా అన్నారు. పాలు ఇచ్చే సమయంలో తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆమె సూచించారు. పాలు ఇవ్వడానికి కొన్ని నిమిషాల ముందు చేతులకు శానిటైజర్ తో శుభ్రంగా కొడుక్కొని.. మూతికి మాస్క్ ధరించాలని సూచించారు. పాలు ఇవ్వడం అయిపోయాకా శిశువును తప్పనిసరిగా దూరంగా ఉంచాలని సూచించారు.
ఈ విధంగా తల్లికి కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చేదాకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. కొన్ని ఘటనల్లో పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్బాలు ఉన్నాయని.. అయితే తల్లి గర్భంలోనే కోవిడ్ బారిన పడ్డారా.. లేక పుట్టిన తరువాత వారికి కరోనా సోకిందా అనే విషయం స్పష్టంగా తెలీదు అని డాక్టర్ మంజు పూరి చెప్పారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ పై వచ్చే అపోహలను నమ్మ కూడదని ప్రజలకు సూచించారు.































