దేశంలో కరోనా కేసులు స్వల్ఫ హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం విడుదల చేసిన నివేదికలో 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా శనివారం 38 వేలుగా నమోదవ్వగా… 617 మంది మృతిచెందారు. శుక్రవారంతో పోలిస్తే ఇది 13 శాతం కంటే తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ప్రస్తుతం 4,12,153 కేసులు యాక్టివ్గా ఉండగా 3,10,55,861 మంది కరోనా నుంచి కొలుకున్నారు.

దేశంలో వ్యాక్సినేషన్ పంపీణి వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. 24 గంటల్లో 49,55,138 మందికి టీకాలు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.































