దేశంలో కరోనా మహమ్మారి కోసం చేస్తున్న లాక్ డౌన్ ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోకి వస్తుంది. ఈ నేపధ్యంలో వరుసగా ఏడో రోజు కూడా పాజిటివ్ కేసులుల సంఖ్య లక్షకు దిగువన నమోదైంది. గడిచిన 24 గంటల్లో 70,421 కొత్త కేసులు బయటపడ్డాయి. 74 రోజుల తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్క రోజులో 3,921 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కి చేరగా.. మహమ్మారి బారిన పడి 3,74,305 మంది చనిపోయారు. వరుసగా 32వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 1,19,501 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 95.43%కి పెరిగింది. క్రియాశీలక కేసుల సంఖ్య మరింత తగ్గి 9,73,158 (3.30%)కి చేరిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.






























