ప్రపంచంలోనే అత్యంత క్రూరమైనది.. భయంకరమైన వాటిలో చెప్పుకోదగ్గది కొండచిలువ. ఇది అత్యంత ప్రమాదకరమైనది కూడా. ఎంత పెద్ద జంతువును అయినా అలవోకగా చంపి తినేస్తుంది. అయితే అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్ లో చూస్తుంటం. ఎంత పెద్ద జంతువు అయినా కొన్ని జంతువులకు బలి అవుతూ ఉంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ముసలి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

నీటిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద జంతువునైనా సింపుల్ గా చంపేయగలదు. నీటిలో దానికి అంత బలం ఉంటుంది. దాదాపు వెయ్యి ఎనుగులకు ఎంత బలం ఉటుందో అంత బలం దానికి నీటిలో ఉన్నప్పుడు ఉంటుందట. తన ఏరియాలోకి వస్తే అడవికి రాజైన సింహనికి కూడా చుక్కలు చూపిస్తుంది. అయితే తాజా వీడియోలో కొండచిలువ ఓ కొలను దగ్గరకు వస్తుంది.
నీళ్లు తాగడానికి వచ్చిన ఆ కొండచిలువను.. అదును చూసి దానిపై దూకేసింది. ఈ వీడియోలో పెద్ద కొండచిలువ ఒక సరస్సు సరిహద్దులో పాకుతూ ఉండటం మీరు చూడవచ్చు. బహుశా దాహం తీర్చుకునేందుకో, స్నానం కోసమో అది అక్కడికి వచ్చి ఉండవచ్చు. దాన్ని గమనించిన ఓ మొసలి సరస్సు ఒడ్డుకు చేరుకుని కాపు కాచింది. సరైన సమయం కోసం చూసి కొండచిలువపై ఎటాక్ చేసింది. దానికి ఏ మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేకుండా పూర్తిగా నమిలేసింది.
దీంతో దాని ప్రాణం అక్కడిక్కడే పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. అయితే ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రతీ ఒక్కరూ దీనిని చూసి లైక్ లు కొడుతున్నారు. వామ్మో.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిని 72 వేలకు పైగా చూశారు.
































