Faria Abdullah: ఇటీవలే ‘జాతి రత్నాలు’తో బ్లాక్బస్టర్గా నిలిచిన ఫరియా అబ్దుల్లా.. ఇటీవలే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో అతిథి పాత్రలో నటించింది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చకున్న ఈ అమ్మడుకు తర్వాత ఆఫర్లు రాలేదనే చెప్పాలి. అఖిల్ హీరోగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అవకాశం వచ్చినా అది.. ఆ సినిమాలో ఆమె క్యారెక్ట్ ఫుల్ గా ఉండదు.. కొద్ది సేపు మాత్రమే ఉంటుంది.

ఫుల్ హీరోయిన్ క్యారెక్టర్ గా మాత్రం అవకాశం రాలేదు. దాని తర్వాత ఈ నటి ఇప్పుడు ‘బంగార్రాజు’లో నాగ చైతన్య మరియు నాగార్జునలతో ఒక ప్రత్యేక పాటలో వారితో కలిసి డ్యాన్స్ వేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పాట ‘వాసివాడి తస్సదియ్యా’ అనే సాంగ్ యూట్యూబ్లో రచ్చ చేస్తోంది.
Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!
దీనిలో కూడా కేవలం ఈ ఒక్క పాటలోనే ఆమె కిపిస్తుందనే టాక్ వినిపిస్తోది. దీని తర్వాత ఫరియాకు ఆపర్లు రాలేదు. తాజాగా నాగార్జున సరసన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి తదుపరి చిత్రం ‘ద ఘోస్ట్’ లో హీరోయిన్ గా ఎంపిక అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున సరసన ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ అనుకున్నారట.

కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత కాజల్ అగర్వాల్ ప్లేస్ లో .. అమాలపాల్, ఇలియానా, మెహ్రీన్ పిర్జాదా వంటి పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఆ అవకాశం ఫరియా అబ్దుల్లా (జాతిరత్నాలు ఫేమ్)కు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మేకర్స్ ఇప్పటికే ‘ద ఘోస్ట్’ చిత్రం మొదటి షెడ్యూల్లను పూర్తి చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “ది ఘోస్ట్” అనే సినిమా తెరకెక్కుతోంది.































