Connect with us

Featured

Flash Back : అప్పట్లో ఈ జంట యమ క్రేజ్.. 1983 లో వచ్చిన వీరి మూడు చిత్రాల్లో ఒకటి ప్రేక్షకులను నిరాశపరిచింది.

Published

on

Flash Back : 1978 ప్రాణం ఖరీదు సినిమాతో ఈ జంట కలిసి వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. అలా ప్రారంభమైన వీరి ఇద్దరి సినీ ప్రయాణం. అనేక విజయవంతమైన చిత్రాలలో ప్రేక్షకులను ఆనందపరిచారు. అలా 1983లో మూడు నెలల వ్యవధిలో వచ్చిన మూడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.

1983, జూలై లో పిఎన్ఆర్ పిక్చర్స్, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో ‘రోషగాడు’ చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో చిరంజీవి మాధవి హీరో,హీరోయిన్లుగా నటించారు.

కథలోకి వస్తే..
చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం.

1983 అక్టోబర్ 20న విజయసాయి పిక్చర్స్, కోడి రామకృష్ణ దర్శకత్వంలో “సింహపురి సింహం” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా నటించిన చిరంజీవికి (రాజశేఖరం) భార్యగా రాధిక, సోదరునిగా గొల్లపూడి నటించారు. అలాగే కొడుకుగా నటించిన చిరంజీవి(విజయ్) ప్రియురాలిగా మాధవి నటించారు. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో నాల్గవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.

చిత్ర సమర్పకుడు ఎం. తిరుపతి రెడ్డి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావించారు. అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ (1982) ఆధారంగా ఒక కథను డెవలప్ చేయమని తిరుపతి రెడ్డి పరుచూరి సోదరులను కోరారు. అలా వారు తయారు చేసిన కథతో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలైంది.
ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించిన వీరి మూడు సినిమాల్లో.. ఖైదీ సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా.. రోషగాడు విజయవంతమై సింహపురి సింహం పరాజయం పొందింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Samantha: సింపతి క్వీన్ అంటూ సమంత  పై ట్రోల్స్… సమంత రియాక్షన్ ఇదే?

Published

on

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ఒకరు. సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే గతంలో యశోద సినిమా సమయంలో ఈమె సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బాధ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇంటర్వ్యూ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవటంతో చాలామంది ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేశారు. సింపతి క్వీన్ అంటూ ట్రోల్ చేశారు.

తాజాగా ఈ ట్రోల్స్ పై సమంత స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది నేను కన్నీళ్లు పెట్టుకొని నా బాధను బయటకు చెప్పగా నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలో నేను పడిన బాధ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇక నేను మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డాను అనే విషయం చెప్పకపోయి ఉంటే మరింత ఘోరంగా ట్రోల్ చేసేవారు.

Advertisement

ఆ బాధ నాకే తెలుసు…
నా బాధ గురించి ఆలోచించకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా తన పట్ల విమర్శలు చేస్తున్న వారికి కూడా సమంత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇక సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారనే తెలుస్తోంది. త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!