జగన్ ప్రభుత్వం రైతులకు నీళ్లు అందించడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన డెల్టా ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. గత టిడిపి హయాంలో జూలై రెండో వారంలోనే రైతాంగానికి నీరు విడుదల జరిగేదని స్పష్టం చేశారు.

కాగా పులిచింతల నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్ర పా చేసినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. పొలాలకు నీరు అందించే విషయంలో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఆనంద్ బాబు పేర్కొన్నారు.



































