Keerthi Suresh: కీర్తి సురేష్.. పేరు తెలియని సినిమా ప్రేమికులు ఉండరు. ఆమె మహానటి చిత్రంలో నటకు ఎన్నో అవార్డులు.. రివార్డులు వరించాయి. అప్పటి గొప్ప నటి సావిత్రి బయోపిక్ లో సావిత్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా నటించారు. నేను శైలజ చిత్రంతో ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతే కాదు.. ఎన్నో చిత్రాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమా పెద్దన్నలో కూడా ఈమె సూపర్ స్టార్ కు చెల్లి పాత్రిలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. ‘సాని కాయిదమ్’, ‘భోళా శంకర్’, ‘వాసి’, ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.

అయితే కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడ్డట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంటే.. ఈ నెల 11న కీర్తి సురేష్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. అయితే హౌం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. ఎవరూ కంగారు పడొద్దని.. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధలను పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కీర్తి సురేష్. అయితే తాజాగా ఆమె అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు.
ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారింది..
ఏంటంటే.. కోవిడ్ బారి నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లోనే తాను కోలుకున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు.. ఆమెకు సంబంధించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారిందని, నేను కోలుకోవాలని నాపై మీరందరూ చూపించిన ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు. అందరూసంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
'Negative' can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! ????❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022





























