Connect with us

Featured

ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ సమస్యలు రావడం ఖాయం?

Published

on

మనం ప్రతిరోజు చేసే వంటలకు రుచి రావాలంటే తప్పనిసరిగా ఉప్పు ఎంతో అవసరం. ఉప్పు వంటలకు రుచిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మన ప్రాణాలకు ఎంతో ముప్పని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా మంది ఎక్కువగా ఉప్పును తినడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఉప్పును రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం..

Crystals of shallow salt in a scoop, spoon on a dark gray table. Background for advertising salt. Table salty. Salted food

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా ప్రాసెస్ ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ ఆహారపదార్థాలలో అధికభాగం ఉప్పు శాతం ఉండటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఉప్పును అధికంగా తీసుకునే వారిలో ఎక్కువగా హృదయసంబంధ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయ్ అని వెల్లడించింది.

పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో ప్రజలు రోజుకు సగటున 11 గ్రాముల చొప్పున ఉప్పు తీసుకుంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.అయితే ఈ విధంగా 11 గ్రాములు ఉప్పు తీసుకోవడం వల్ల రాబోయే రోజులలో ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు తెలుపుతున్నారు.ప్రతి మనిషి రోజుకు సగటున కేవలం ఐదు గ్రాములు తీసుకున్నప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.

Advertisement

ఉప్పులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం మన శరీరంలో కరగడానికి అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. అందుకోసం మన కణాల నుంచి నీటిని గ్రహించడం వల్ల తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అధిక సోడియం కారణంగా ధమనులలో అధిక ఒత్తిడి పెరిగి రక్తపోటుకు కారణం అవడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు వంటివి వ్యాపిస్తాయి. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో అధిక దాహం పెరుగుతుంది. ఈ క్రమంలోనే అవసరానికి మించి నీటిని తీసుకోవడం వల్ల మూత్ర సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కేవలం రోజుకు ఐదు గ్రాముల చొప్పున ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.

Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!