బుల్లితెరపై ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో చెప్పుకునేది సుధీర్, హైపర్ ఆది మరియు రాంప్రసాద్. అయితే ఇందులో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పంచ్ లతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. గత 12 సీజన్ల నుంచి కొనసాగుతున్న ఢీ షో గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 13 వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నడుస్తోంది. దీనిలో కామెడీని కూడా జోడించేందుకు సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆదీ, రష్మీ, దీపికాలు ప్రత్యేక ఆకర్షణగా గా నిలుస్తున్నారు. డ్యాన్స్ పర్మామెన్స్ తర్వాత మధ్యలో ఏర్పడే గ్యాప్ లో వీళ్ల సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి యాంకర్ గా ప్రదీప్ తోడై కామెడీని పీక్ కు తీసుకెళ్తుంటారు.

అయితే తాజాగా.. ఢీ ప్రోమో ఒకటి వైరల్ గా మారింది. సాధారణంగా ఇందులో కింగ్స్ తరఫున ఆది, సుధీర్ లు లీడర్లుగా ఉంటారు. క్వీన్స్ తరఫున రష్మీ, దీపికా ఉంటారు. కంటెస్టెంట్లు డ్యాన్స్ పర్మామెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు విన్ అయితే వారు మిగతా టీమ్ లీడర్లకు టాస్క్ ఇస్తుంటారు. ఈ ప్రోమోలో కూడా క్వీన్స్ ఒక డ్యాన్స్ కంటెస్టెంట్ గెలవగా.. కింగ్స్ కు టాస్క్ ఇవ్వాలి.

ఇలా సుధీర్, ఆది టీమ్ టాస్క్ చేయాలని కోరారు రష్మీ టీం. ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ ఈ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అయితే తమకు మూడ్ లేదు.. మేము టాస్క్ చేయమని వెళ్లి సోఫాలో కూర్చున్నాడు ఆది. సుధీర్ అతడిని ఒప్పించే క్రమంలో “ఆర్ యూ వర్జిన్” అంటూ షాకింగ్ క్వచ్చన్ వేశాడు ఆది.
దీంతో సుధీర్ కు నోటి నుంచి మాట రాలేదు. ఆ క్వచ్చన్ కు జడ్జిలు సైతం షాక్ అయ్యారు. ఇలా రెండు సార్లు ఆది అదే ప్రశ్న అడగడంతో సుధీన్ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇదిలా ఉండగా తము ఇచ్చిన టాస్క్ ఎందుకు చేయరని రష్మీ ఆగ్రహంతో గొడవ గొడవ చేసేసింది. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

































