తెలుగు సినీ నటిగా అందరికీ సుపరిచితమైన వారిలో నటి జ్యోతి ఒకరు. ఈమె ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె వాంప్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఒకానొక సమయంలో నటి జ్యోతి గురించి గతంలో డ్రగ్స్ కేసులో ఈమె ఇరికించడంతో అప్పట్లో ఈ విషయం ఎంతో సంచలనంగా మారింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి ఈ విషయం గురించి స్పందించారు.ఈ విషయంలో తన ప్రమేయం ఏ మాత్రం లేదని ఇంట్లో ఉన్న నన్ను తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని ఆమె వెల్లడించారు. ఒకవేళ ఆ తప్పు నేను చేసి ఉంటే సాక్షాలు చూపించండి అంటూ ఈ సందర్భంగా ఈమె నిలదీశారు.
అప్పుడే నా భర్త నుంచి విడాకులు ఇవ్వడం, తన తండ్రి మరణంతో తను ఎంతో డిప్రెషన్లో ఉన్నానని, ఇలా డిప్రెషన్ లో ఉన్న నన్ను ఈ విధంగా ట్రాప్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అప్పటికింకా నాకు కేవలం రెండు సంవత్సరాల బాబు ఉన్నారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. కేవలం ఒక కేసును తప్పుదోవ పట్టించడం కోసం కావాల్సిగానే నన్ను ట్రాప్ చేసి హైలెట్ చేశారని, అయితే ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారో ఇప్పుడు వాళ్లు చాలా అనుభవిస్తున్నారని ఈమె వెల్లడించారు.
ఈ క్రమంలోనే తన తల్లి రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి మృతి చెందింది. తన భార్య మరణించి ఎంతో బాధ అనుభవిస్తున్నారని నా గురించి చెడుగా మాట్లాడిన వారు నాకు అన్యాయం చేయాలనుకున్న వారందరూ పూర్తిగా అనుభవిస్తున్నారని, కర్మ ఎప్పుడూ కూడా తన అడ్రస్ మర్చిపోవదంటూ ఈ సందర్భంగా జ్యోతి డ్రగ్స్ కేసు గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
































