తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో కృష్ణ, బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే కృష్ణ విజయ కృష్ణ బ్యానర్ లో ఇందిరా గాంధీపై ఒక బుర్ర కథ చేశారు. దానికి సంభందించి sp బాల సుబ్రమణ్యం ప్లే బ్యాక్ సింగర్ గా చేశారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారికి కాంగ్రెస్ మీద ఉన్న మక్కువతో ఇందిరా గాంధీ మీద బుర్ర కథ చేశారని పద్మాలయ శర్మ అన్నారు.

వాళ్ళు అభిమానంతో ఎంత ఇష్టపడి చేపించుకున్నా సరే దానికి ఇచ్చిపుచ్చుకునే విషయంలో బాల సుబ్రమణ్యం గారి నుంచి ఒక ప్రస్థావన వచ్చిందని ఆయన వివరించారు. దాంతో వాళ్ళు హర్ట్ అయ్యారని ఆయన తెలిపారు. అంతకు ముందు కృష్ణ గారితో బాల సుబ్రమణ్యం ఒక సినిమా చేసినప్పుడు, ఏదో ఫేమస్ విషయంలో కొన్ని మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
ఇలా పేమెంట్స్ విషయంలో కొంచెం లేట్ అయ్యేదని ఆయన అన్నారు. ఇలా జరిగినప్పుడు వాళ్ళు కూడా అప్పటి విషయం తీసుకొచ్చి ముందు అవి బయటకు తీయండి అని వారి మధ్య మాట మాట పెరిగి పలు విమర్శలకు దారి తీసిందని ఆయన తెలిపారు. అలా వారి మధ్య దూరం ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ కారణం చేత హీరో కృష్ణ బాలు మధ్య గొడవ ఏర్పడింది.


































