రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఐటీ మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈమేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబును మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.
నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలతో పాటు అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలనకు అనుమతులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కాగా నియోజకవర్గానికి నిధులను విడుదల చేయడం పై మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రమేశ్బాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి లో ముందంజలో ఉందని ఎమ్మేల్యే స్పష్టం చేశారు.
Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు సంచలంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి అత్యధిక మెజారిటీ సొంతం చేసుకుని అధికారం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కూటమిలో భాగంగా జనసేన పార్టీ కూడా భాగమైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటూ ఒకప్పుడు ఆయనపై ఉన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇక జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పలు దిశా నిర్దేశాలు చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంచి స్థాయిలో ఉండే దీంతో ఎంతోమంది ఇతర పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా కార్యకర్తలు సైతం జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Advertisement
కేసులు పెట్టనివారు.. ఇలా జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కండిషన్లను కూడా పెట్టారు. జనసేన పరివారాన్ని ఇబ్బందులకు గురి చేయని.. కేసులు పెట్టని వారికి మాత్రమే జనసేన కండువా కప్పుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారని ఇటీవల నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.
Araa Mastan: ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 50 రోజులవుతున్న ఇప్పటికీ ఎన్నికల ఫలితాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే మరోవైపు సంక్షేమ ఫలాలను కూడా అందించారు అయితే ఈసారి ఎన్నికలలో తప్పకుండా తిరిగి తామే అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.
ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి పంపించాలని కూటమి కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ విషయంలో కూటమి సక్సెస్ అయిందని చెప్పాలి. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేవరకు కూడా ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే విధంగా తెలియజేశాయి కానీ కేకే సర్వే మాత్రం కూటమి ఘనవిజయం సాధిస్తుందని, కూటమి 161 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు.
Advertisement
ఇలా కేకే సర్వే చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు కానీ చివరికి ఆయన చెప్పినదే నిజం కావడంతో ఒక్కసారిగా కేకే సర్వే ఆల్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోయింది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన కేకే సర్వే గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 40 నియోజకవర్గాలు..
ఈ సందర్భంగా ఆరా మస్తాన్ మాట్లాడుతూ తాను అన్ని నియోజకవర్గాలలో శాంపిల్స్ తీసుకొని సర్వే చేయలేదని తెలిపారు. కేవలం 40 నియోజకవర్గాలలో మాత్రమే శాంపిల్స్ తీసుకొని అనంతరం ఫీడ్ బ్యాక్ ద్వారా ఫలితాలను తెలిపానని వెల్లడించారు. ఇక కేకే సర్వే గురించి ఈయన మాట్లాడుతూ..కేకే సర్వే చూసి షాక్ అయ్యానని, కచ్చితంగా ప్రిడిక్ట్ చేసిన అతన్ని అభినందించాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే కేకే సర్వే మెకానిజం, శాంపుల్స్ గురించి అక్కడ ప్రస్తావించలేదని గుర్తు చేశాడు.
Pawan Kalyan: జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో తరచూ వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పలువురు ఈయన పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ సభలలో కూడా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హింసల గురించి పలు విషయాలు వెల్లడించారు 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం రాష్ట్రంలో హింసలను ప్రోత్సహించింది అని తెలిపారు.
నేను పుట్టినప్పటినుంచి నాపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా నాపై 17 కేసులు అలాగే పవన్ కళ్యాణ్ పై ఏడు కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు తెలిపారు. నాపై పెట్టిన కేసులు కారణంగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపే పరిస్థితికి తీసుకువచ్చారని తెలిపారు.
Advertisement
చట్టబద్ధంగా చేశారు.. ఇక అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది చట్టబద్ధంగానే చేశారు. నువ్వు (జగన్) కూడా తెగ కలవరిస్తున్నావ్ కావాలంటే పోయి కాపురం చెయ్యవయ్యా అన్నా నేను కూడా అని గుర్తు చేశారు చంద్రబాబు. వ్యక్తి గతంగా తీసుకురావద్దని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మహిళలను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు హెచ్చరించారు.