Venuswamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన జ్యోతిష్యులుగా ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడైతే సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పారో ఆ క్షణమే ఈయన పాపులర్ అయ్యారు.అయితే ఈయన చెప్పిన విధంగా సమంత నాగచైతన్య విడిపోవడంతో వేణు స్వామిని నమ్మే వారి సంఖ్య అధికమైంది.

ఇలా నిత్యం అందరి జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈయన చెప్పిన జాతకాలు కాస్త అటు ఇటు తేడా కావడంతో పలువురు ఈయన జాతకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి తన గురించి పలు విషయాలను వెల్లడించారు.
తాను కేవలం జ్యోతిషం మాత్రమే చెబుతూ బతకలేదని తెలిపారు. నాకు వైన్ షాప్స్ ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ లను చేస్తున్నానని తెలిపారు .ఇలా వీటన్నింటిని చూసుకుంటూ నా ఫ్యామిలీకి కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉంటానని తెలిపారు. అందుకే నా దగ్గర ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి అంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
రియలేస్టేట్ వ్యాపారం…
ఇక వేణు స్వామి వద్ద అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఎనిమిది నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది వేణు స్వామిని సంప్రదించడం కోసం మనం ఫోన్ చేస్తే తన అసిస్టెంట్లు మనకు ఫలానా తేదీ అపాయింట్మెంట్ ఇస్తారని అంతకు ముందు రోజు వాళ్ళు ఫోన్ చేసి మనకు గుర్తు చేస్తారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తన బిజీ షెడ్యూల్ గురించి చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.































